గూడెం కొత్త వీధి పెన్ పవర్ జూలై 20:అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్త వీధి ఎంపీటీసీ పసుపులేటి నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు.వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని కావున వాగులు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంటే దయచేసి కాలువలు దాటడానికి ప్రయత్నం చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. అలాగే మట్టి ఇళ్లు,రేకుల ఇల్లులలో గోడలు వర్షానికి తడిసి కూలే ప్రమాదం అధికంగా ఉందని కావున జాగ్రత్తగా ఉండాలని అన్నారు.తడిసిన విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవద్దని తడి వలన విద్యుత్ స్తంభాలలో కరెంటు సప్లై అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. వరి నారుమళ్లు వర్షానికి నీట మునిగాయని అధికారులు నష్టపరిహారం అందించేందుకు కృషి చేయాలని కోరారు.అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని నాగమణి కోరారు.