Pen Power

చింతపల్లి ఆసుపత్రి వాస్తవ పరిస్థితులను వివరించిన జనసేన నాయకులు 

చింతపల్లి ఆసుపత్రి వాస్తవ పరిస్థితులను వివరించిన జనసేన నాయకులు 

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/చింతపల్లి,పెన్ పవర్,ఆగస్టు13: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడా గ్రామపంచాయతీ పరిధిలోగల ఊబ పొలం గ్రామానికి చెందినటువంటి గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో ప్రసవించే సమయంలో తల్లి బిడ్డ ఇద్దరూ గత మూడు రోజుల క్రితం చనిపోవటం జరిగింది.ఈ యొక్క బాధాకరమైన సంఘటన వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జాయింట్ కమిషనర్, డైరెక్టర్, సెకండరీ హెల్త్ ఆఫీసర్ చింతపల్లి ఆసుపత్రికి పరిశీలన నిమిత్తం సోమవారం రావటం జరిగింది.వెంటనే అక్కడకు చేరుకున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం,అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబర్ గొర్లె వీర వెంకట్, జనసేన పార్టీ చింతపల్లి మండల ఉపాధ్యక్షుడు కిముడు కృష్ణమూర్తి చింతపల్లి ఆసుపత్రి యొక్క వాస్తవ పరిస్థితులను వివరించారు.IMG-20240813-WA0000 అలాగే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేకుండా వైద్యులకు తగు సూచనలు చేయాలని వారు జాయింట్ కమిషనర్ దృష్టి తీసుకురావడం జరిగింది.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.