Pen Power

కాజులూరులో ఎంపీ బోస్‌ ఇంటింటా ప్రచారం

కాజులూరులో ఎంపీ బోస్‌ ఇంటింటా ప్రచారం

కాజులూరు

 మండల పరిధిలోని కాజులూరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది పిల్లి సూర్యప్రకాశ్‌కు మద్దతుగా గురువారం ఎంపీ బోస్‌ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన ఐదేళ్ల పాలనను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విజయానికి కృషిచేయాలన్నారు.ప్రతి ఒక్కరూ వైసీపీ కి ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్ధించారు.బోస్‌ వెంట వైసీపీ నాయకులు దండంగి చిన్నారావు, యాళ్ల గొల్లబాబు, యాళ్ల సత్తిబాబు,సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

About The Author: Admin

Admin  Picture