గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జూన్ 20: ప్రభుత్వం ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి వెళ్ళటానికి ఉపాధ్యాయులు ఆపసోపాలు పడుతున్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా యోగంధ్ర కార్యక్రమానికి రావాలని అధికారులు ఆదేశించటంతో ఉపాధ్యాయులు యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొనటానికి బయలుదేరారు. అయితే వెళ్ళటానికి బస్సులు లేక ఉపాధ్యాయులు రింతాడా లో నిరీక్షిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన బస్సులు అందుబాటులో లేకపోతున్నాయని అధికారులు ఎటు తేల్చని వైన్యంతో ఉపాధ్యాయులు వేచి చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.