గూడెం కొత్తవీధి,పెన్ పవర్, అక్టోబర్ 23:గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ, సంకాడ, పెదవలస, దేవరపల్లి, లకవరపుపేట,ధామనపల్లి పంచాయతీలలో అన్ని గ్రామాలకు అక్టోబర్ 24న (శుక్రవారం) ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. వేణుగోపాల్ తెలిపారు.11 కేవీ పెదవలస ఫీడర్ లైన్పై మరమ్మత్తు పనులు చేపడుతున్నందున ఈ నిలిపివేత ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాలని అనవసర ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.