👉🏻దౌర్జన్యాలు – దొంగ ఓట్లు – పోలీసుల మద్దతు
ఉప ఎన్నికల సమయంలో పోలీసులను అడ్డంపెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై గుండాలను దించి దాడులు జరిగాయని, దౌర్జన్యానికి పాల్పడి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. “ఈ పరిస్థితుల్లో టీడీపీ గెలిచిందని సంబరాలు చేసుకోవడం చంద్రబాబుకు సిగ్గు కలిగించే విషయం,” అని అన్నారు.
👉🏻టీడీపీకి సవాల్ విసిరిన విశ్వేశ్వరరాజు
“మీకు ధైర్యం ఉంటే ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. మీ పార్టీ గెలిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మీరు ఓడిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు,” అని శాసనసభలో ప్రకటన చేయాలంటూ సవాల్ విసిరారు.
👉🏻ఎన్నికల కమిషన్ పై మండిపాటు
ఈ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం వెనుకేసుకుని పని చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న కమిషన్ అంతగా దిగజారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా ఈ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
👉🏻ఉప ఎన్నికలను రద్దు చేయాలి
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేసి, ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలని మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇది అత్యవసరమని స్పష్టం చేశారు.