చింతపల్లి పెన్ పవర్ మే 17: చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారి రౌరింతాడ గ్రామ సమీపంలో జాతీయ రోడ్డుపై జరిగినఘోరరోడ్డుప్రమాదంఒకకుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.పెంటపాడు గ్రామానికి చెందిన నల్లాల చందర్రావు (38), భార్య కృష్ణవేణి (32), చందర్రావు అన్నయ్య కుమారుడు అఖిలేష్ (13) కలిసి బంధువుల రజస్వల కార్యక్రమానికి చిట్రాలగొప్పు వెళ్లి హాజరై తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషాదకర ఘటన రౌరింతాడ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. భద్రాచలం నుండి
మృతి చెందిన నల్లల చందర్రావు బైక్ మెకానిక్ గా పెంటపాడు గ్రామంలో ఎటువంటి బైక్ అయినా రిపేర్ చేసే నైపుణ్యం ఆయనలో ఉందని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంచాలా బాధాకరంగా ఉందని స్నేహితులు వాపోతున్నారు సమాచారం అందుకున్న చింతపల్లి సీఐ ఎం. వినోద్ బాబు, ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విచారించి, సంబంధిత కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.