దరఖాస్తు చేసిన అనంతరం, సంబంధిత పోలీస్ అధికారులు మండప స్థలాన్ని పరిశీలించి, క్యూఆర్ కోడ్ తో కూడిన ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం)*ను జారీ చేస్తారని వివరించారు. మండపాలను రోడ్డు మధ్యలో కాకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా, రోడ్ల పక్కన ఏర్పాటు చేయాలని సూచించారు.
మండపాల వద్ద 24 గంటలు అందుబాటులో ఉండే వాలంటీర్లను నియమించాలని,అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సమస్యాత్మక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఎన్వోసీ మంజూరుకు పోలీస్ శాఖ ఎటువంటి రుసుములు వసూలు చేయదు అని స్పష్టం చేశారు. వినాయక చవితిని ఇతర మతస్తులకు ఇబ్బంది కలగకుండా,సమన్వయంతో జరుపుకోవాలని, మండపాల నిర్వహణలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వినాయక ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం నిషేధించబడిందని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.