వర్షాలకు కాలువలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దు: వైసిపి నాయకులు వనపల రాజేష్

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 18: గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ వైసీపీ నాయకులు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలకు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాబట్టి ప్రజలు కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు. విద్యుత్ స్తంభాలను తాకరాదని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.IMG-20250818-WA0557

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.