Category
కాకినాడ / Kakinada
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ట్రెండింగ్ విశాఖపట్నం / Visakhapatnam అనకాపల్లి / Anakapalli కాకినాడ / Kakinada తూర్పు గోదావరి జిల్లా / East-Godavari పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District కృష్ణా / Krishna ఎన్.టి. ఆర్ జిల్లా / NTR-District గుంటూరు / Guntur ప్రకాశం / Prakasam బాపట్ల / Bapatla ఎస్.పి. ఎస్. ఆర్. నెల్లూరు / S. P. S. R. Nellore
మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం — హై అలర్ట్లో ప్రభుత్వం
Published On
By Admin
బంగాళాఖాతంలో 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు సహాయక చర్యలకు రూ.19 కోట్లు — ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం గణపతి మండపాల వద్ద పోలీసు డ్రోన్ కెమెరాలతో నిఘా
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో గణపతి మండపాల వద్ద పోలీసు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు జగ్గంపేట సీఐ వై ఆర్ కే శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం జగ్గంపేటలో పలు గణపతి మండపాలను ఆయన సందర్శించి దర్శనం చేసుకున్నారు. ఆయా మండపాల వద్ద చుట్టుపక్కల ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో మూడు మండలాల్లో 493 గణపతి మండపాలకు అనుమతులు ఇచ్చామన్నారు. గణపతి మండపాల వద్ద కమిటీ సభ్యులు భద్రతా చర్యలు తీసుకోవాలని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. అలాగే గణపతి నిమజ్జనాలు చేసే పలు ప్రాంతాలను పరిశీలించినట్లు సీఐ వై ఆర్ కే తెలిపారు. డీఎస్సీలో 19వ ర్యాంకు సాధించిన రామవరం వాసి
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: డీఎస్సీ ఫలితాల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వీరంరెడ్డి సుజిని రాష్ట్రంలో 19వ ర్యాంకు సాధించారు. ఈమె ఎంఏ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి విజయం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమెను టిడిపి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడబాల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జనసేన నాయకులు మొగిలి గంగాధర్, మండపాక పాపారావు, సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం, మరుకుర్తి గంగాధర్, నీలం నాగులు మాగంటి నాని తదితరులు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట, పెన్ పవర్, జూలై 27: జగ్గంపేట కాపు కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సొసైటీ చైర్మన్ పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని జ్యోతుల నెహ్రూను కొందరు ప్రశ్నిస్తున్నారని వారికి ఇదే నా సమాధానమన్నారు. 2004లో ఏవిధంగా రాజకీయ స్ట్రాటజీ ఉపయోగించారో దాన్ని వాళ్లు ఇప్పుడు ఉపయోగిస్తున్నారన్నారు. అప్పుడు తోట నరసింహంకు టికెట్ ఇచ్చినప్పుడు వెంకటాచలం మాదిరి కనిపించడానికి మీసం గీయించేశారని అది జగ్గంపేట ప్రజలను మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. సూర్యనారాయణమ్మ అనే మహిళ బాధ్యత తీసుకుంటానని చెప్పి మాట తప్పారన్నారు. వీరవరం సొసైటీకి పోటీ వద్దని తోట వెంకటాచలం కోరితే అక్కడి నుంచి నెహ్రూ పోటీకి ఎవరినీ దింపలేదని అది అప్పుడు ఉన్న నాయకులకు మాత్రమే తెలుసునన్నారు. శత్రు వుకు అన్యాయం చేయని వ్యక్తి జ్యోతుల నెహ్రూ అని అది జగమెరిగిన సత్యమన్నారు. ఏరోజు తాను నోరు విప్పలేదని వారు మాట్లాడిన తీరుకు ఇప్పుడు సమాధానం చెబుతున్నానని అవి వాస్తవాలు కాదా అని నవీన్ ప్రశ్నించారు. పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట, పెన్జ పవర్, జూలై 25: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుండి ఏలేరుకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరై మోటార్ స్విచ్ ఆన్ చేసి, గోదావరి జలాలకు పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగినదని రైతాంగానికి సాగునీరు అందించడానికి ఎప్పుడూ ముందుంటామన్నారు. జూలై నెలాఖరుకి తాళ్ళూరు లిఫ్ట్ నుంచి నీరు పారుతుంది
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 4: గండేపల్లి మండలం తాళ్ళూరు లిఫ్ట్ నుంచి జూలై నెలాఖరుకి ఖచ్చితంగా నీరు పారుతుందని పంటలు వేసుకునేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం గండేపల్లి మండలం మురారిలో ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గత సీజన్ లో నీరు పంటలకు అందే పరిస్థితి లేక పంటలు వేసుకోవద్దని తేల్చి చెప్పాననన్నారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబుతో 15సార్లుకు పైగా మాట్లాడి ఇరిగేషన్ మంత్రితో చర్చలు జరిపానన్నారు. ఇటీవల ఏవరో సోషల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే నెహ్రూ వల్లే తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండేదని విమర్శలు చేస్తున్నారని అసలు తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో తెలుసా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించలేదని మాట్లాడుతున్నారని అసలు బడ్జెట్ ఎలా ప్రవేశ పెడతారో కూడా తెలియని వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. తాళ్ళూరు లిఫ్ట్ పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామని ఏదేమైనప్పటికీ జూలై నెలాఖరుకి నీరు పారుతుందని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు. ఎన్నో అవమానాలు తట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట, పెన్ పవర్, మార్చి 8: ఎన్నో అవమానాలు తట్టుకుని, ఆయనకున్న సినిమా అవకాశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు పరిణయ ఫంక్షన్ హాల్ లో శనివారం రాత్రి జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కౌడా చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 11 సంవత్సరాలు పార్టీని తన భుజాన మోసారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే ఈ ఆవిర్భావ సభను ప్రతీ ఒక కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున సభకు హాజరై గర్వపడేలా సభ నిర్వహిద్దామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భారీగా హాజరయ్యారు. జగ్గంపేటలో 492 కేజీల గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్
Published On
By G ANIL KUMAR
కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై బుధవారం జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుండి జగ్గంపేట ఓ ఇంట్లో ఉంచి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. 8 మందిని అరెస్టు చేసి రూ.30.50లక్షల విలువ గల 492 కేజీల గంజాయి, ఒక కారు,ఏడు సెల్ ఫోన్లు రూ.రెండు లక్షల 78 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు, గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. ఒక్క రోజే జనసేన ప్లీనరీ
Published On
By Admin
కాకినాడ , పెన్ పవర్ ఫిబ్రవరి 22: జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ప్లీనరీ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు అభిమాన శ్రేణులకి పండగనే చెప్పాలి. సాధారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లీనరీలు ఏర్పాటు చేస్తుంటారు పార్టీల అధినేతలు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడానికి ప్లీనరీలను ఏర్పాటు చేస్తాయి... జగ్గంపేట : ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట, పెన్ పవర్, ఫిబ్రవరి 21: జగ్గంపేట శివారు టవర్ కాలనీలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో శుక్రవారం జగ్గంపేట ఎస్ఐ టి.రఘునాధరావు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6100 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎక్కడైనా జూదాలకు పాల్పడిన, అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రఘునాధరావు హెచ్చరించారు. విలేకరులపై దాడులు ఖండించాలని జగ్గంపేటలో నిరసన ధర్నా
Published On
By G ANIL KUMAR
విలేకరులపై జరుగుతున్న దాడులు ఖండించాలని బుధవారం జగ్గంపేటలో పాత్రికేయులు నిరసన ధర్నా నిర్వహించారు. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరయ్యారు. పార్వతీపురం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్, తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జగ్గంపేట సీఐ వై ఆర్ కే శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. బుడగ తెచ్చిన గొడవ.. నలుగురు అరెస్ట్
Published On
By G ANIL KUMAR
చిన్నపిల్లోడు సరదాగా ఆడుకుంటున్న బుడగ వల్ల గొడవై నలుగురు అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన సంఘటన మంగళవారం జగ్గంపేట మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి జగ్గంపేట సీఐ వైఆర్ కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన డి.ఏసు ఇంటి వద్ద గత నెలలో రాత్రి 8 గంటల సమయంలో ఏసు మనవడు బుడగలతో ఆడుకుంటుండగా ఆ బుడగ వెళ్లి అదే వీధిలో గల బి.మార్తమ్మకు తగలడంతో ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారి కుటుంబ సభ్యులైన బి.కృష్ణ బి.రాజేష్ పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలు కలిసి గునపాలు, కర్రలు, రాళ్లతో ఏసు ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఏసు కుడి చెయ్యి విరిగి గాయం కావడం, కుటుంబీకులు గాయాలు పాలయ్యారు. దీనిపై ఏసు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలైన బి.రాజేష్, పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. ఎవరైనా ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 