అభివృద్ధి సంక్షేమం జరగాలంటే వైయస్సార్సీపి నే గెలిపించండి

అభివృద్ధి సంక్షేమం జరగాలంటే వైయస్సార్సీపి నే గెలిపించండి

వై రామవరం

ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి 

రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే మరొకసారి వైయస్సార్సీపి పార్టీని గెలిపించి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థిని నాగులపల్లి ధనలక్ష్మి  కోరారు.మండలంలోని అప్పర్ పార్ట్ లో శుక్రవారం  జి.కొత్తూరు,గుర్తేడు, అల్లూరిగడ్డ, కడారికోట,ఎడ్లకొండ, గొరకనూరు, దారగడ్డ,లింగవరం, ఇర్లవాడ, పూలోవ,బబ్బిలోవ, బూసి కోట కారుమానుగుంది పాము గొంది గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి వైయస్సార్సీపి కి మద్దతు కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యాలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పాలన సాగిందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన సంక్షేమం ఏ దేశంలో ఏ ప్రభుత్వం అందించలేదని ఇదే తరహాలో రానున్న రోజుల్లో సంక్షేమ అభివృద్ధి జరగాలంటే అందుకు వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లపై ఉందని దీనికి అనుగుణంగా అనుబంధ సంఘాలు ప్రజాప్రతినిలు వైసీపీ శ్రేణులు వీర సైనికుల వలె  పనిచేయాలని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన అభివృద్ధిని ధైర్యంగా ప్రజలకు వివరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి అయిన తనకు ,ఎంపీ అభ్యర్థి  అయినా తనుజరాణి కి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వై. రామవరం  మండల కన్వీనర్, ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీ లు,సర్పంచులు,సొసైటీ ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,డైరెక్టర్లు, కోఆప్షన్ మెంబర్లు, వైస్ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు,ఎక్స్ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts