జనసేన పార్టీ పంచాయతీ కమిటీల ఏర్పాటు పట్ల చర్యలు వేగవంతం:పాడేరు అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీర వెంకట్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 29:రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గంలో పంచాయతీ కమిటీల ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య మార్గదర్శనంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.ఈ సందర్భంగా పాడేరు నియోజకవర్గం కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీరవెంకట్, కొయ్యం బాలరాజు మాట్లాడుతూ – "రాజకీయ మార్పు కోసం తహతహలాడుతున్న యువత గిరిజన ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. జనసేన సిద్ధాంతాలతో ముందుకు సాగేందుకు ఆసక్తి చూపుతున్న యువతను సంఘటితం చేసి, వారిని నాయకత్వ పాత్రల్లోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ దిశగా గ్రామ పంచాయతీ కమిటీల ఏర్పాటుతో పాటు యువ నాయకులను సన్నద్ధం చేస్తున్నాం" అని తెలిపారు. ప్రతి పంచాయతీలో కమిటీల ఏర్పాటు, అధ్యక్షులు – ఉపాధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, స్థానిక ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేయడం కోసం పూర్తి ప్రణాళిక రూపొందించామని వీరవెంకట్ తెలిపారు.గూడెం కొత్తవీధి మండలంలో జనసేనకు కేటాయించిన స్థానాలన్నింటినీ గెలుచుకోవడంతో పాటు, కూటమి భాగస్వామ్యంతో 16 పంచాయతీలను కైవసం చేసుకునే లక్ష్యంతో చర్యలు చేపట్టామన్నారు.ఆ దిశగా కార్యాచరణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.