ఎంపీడీవోగా ఇమ్మానుయేలుకు అదనపు బాధ్యతలు 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబర్ 1:IMG-20250901-WA0668 అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి ఎంపీడీవో వై. ఉమా మహేశ్వర రావు ఆదివారం సాయంత్రం తన పదవీ విరమణ వలన విధుల నుండి విడుదలయ్యారు.దీంతో జిల్లా ప్రజా పరిషత్, విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు కార్యాలయ పరిపాలనాధికారి ఇమ్మానుయేలు సోమవారం ఉదయం నుంచి ఎంపీడీవోగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.ఇమ్మానుయేలు ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎంపీపీ బోయిన కుమారి, స్థానిక సర్పంచ్ సుభద్ర, గాలికొండ సర్పంచ్ బుజ్జిబాబు, కో ఆప్షన్ సభ్యులు దావూద్, వైసిపి నాయకులు అరుణ్ కుమార్, కృప, బాబి, బోయిన వెంకట్ తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుస్సాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్త ఎంపీడీవోకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.