శాంతి భద్రత దృష్ట్యా, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు

శాంతి భద్రత దృష్ట్యా, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు

ఒంగోలు క్రైమ్ 

IMG-20240414-WA0025

శాంతి భద్రత దృష్ట్యా, నేరాల కట్టడి, నేరాలు నియంత్రణకు రాత్రి వేళ స్వయంగా తనిఖీలు  నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్..


జిల్లాలోని శాంతిభద్రతల దృష్ట్యా,  నేరాలు నియంత్రణకు రాత్రి వేళ జిల్లా కేంద్రంలో గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించేందుకు స్వయంగా జిల్లా ఎస్పీ శనివారం అర్థరాత్రి ఒంగోలులోని చర్చి సెంటర్, అద్దంకి బస్టాండ్ మరియు ముఖ్యమైన ప్రదేశాలలోను జిల్లా ఎస్పీ సందర్శించారు. వాహనాలు తనిఖీలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు తెలియచేసారు. నేరాల కట్టడ, నేరాలు నివారణకు సమర్ధవంతమైన రాత్రి బీట్లు ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలని సూచించారు. అనుమానితులు, గుర్తు తెలియని వ్యక్తులను నిలిపి వివరాలు తెలుసుకోవాలని, ఆధార్ కార్డులు, పరిశీలించాలని, అనుమానితులను పోలీసుస్టేషన్కు తరలించి దర్యాప్తు చేయాలన్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

IMG-20240414-WA0024

ఎవరికైనా అనుమానుస్పద వ్యక్తులు ఉంటే వెంటనే డయల్ -112  లేదా స్ధానిక పోలీస్ స్టేషన్ కు తెలియచేయాలని ఎస్పీ  ప్రజలను కోరారు.అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ముఖ్యమైన ప్రదేశాలలో శాంతి భద్రతల దృష్ట్యా, నేరాల నియంత్రణకు, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.ఎస్పీ గారి వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె. నాగేశ్వరరావు, ఎ.ఎస్పీ (క్రైమ్) యస్.వి. శ్రీధర్ రావు, ఒంగోలు డిఎస్పీ ఎం.కిషోర్ బాబు,ఒంగోలు  వన్ టౌన్ సిఐ లక్ష్మణ్, ఒంగోలు టు టౌన్ సీఐ జగదీష్, ఒంగోలు తాలూకా సిఐ భక్తవత్సల రెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.

Tags:

About The Author

Related Posts