ఆక్రమణలు తొలగించాల్సిందే:జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ 

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే31: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు,సిసిఎల్ఎ మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణలు తొలగించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు.శనివారం తనను కలసిన పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా నదీ గర్భాలు, ప్రభుత్వ పోరంబోకు భూములు, నీటి వాగులు, రహదారి మార్జిన్లలో ఆక్రమించిన ఆక్రమణలను ఎనిమిది వారాలలోగా తొలగించాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో అటువంటి ఆక్రమణలు గుర్తించి నిభంధనల మేరకు స్వచ్చందంగా తొలగించుకోవాలని ఒక వారం నోటీసు జారీ చేయడం జరిగిందని, దానికి స్పందించని వారికి మరో రెండు రోజులు గడువు విధిస్తూ తిరిగి నోటీసులు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.రెండు రోజుల గడువు తరువాత, రెవెన్యు, పంచాయతి రాజ్, పోలీస్ సహకారంతో తొలగింపుల ప్రక్రియ చేపట్టడం జరిగిందని తెలిపారు.ఇప్పటికే రహదారి వెడల్పుకు సంబంధించి మార్కింగ్ చేయడం జరిగినందున మార్కింగ్ ప్రకారం ఆయా యజమానులు స్వచ్చందంగా ఆక్రమణలు తొలగించుకొని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసా

IMG-20250531-WA1101 రు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.