జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews