G ANIL KUMAR
కాకినాడ / Kakinada 

గేమ్ చేంజర్ ఈవెంట్ కు జగ్గంపేట నుంచి భారీగా తరలివెళ్లిన మెగా అభిమానులు

గేమ్ చేంజర్ ఈవెంట్ కు  జగ్గంపేట నుంచి భారీగా తరలివెళ్లిన మెగా అభిమానులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజేష్ కల్లేపల్లి యుఎస్ఏ ఆధ్వర్యంలో భారీ కార్లు, బైక్ ర్యాలీలతో శనివారం మధ్యాహ్నం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జగ్గంపేట శివారు నగరం లో మెగా అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేసి ఈవెంట్ కు పాసులు అందజేశారు. కల్లేపల్లి రాజేష్ టీం జన్నెల శంకర్, పసుపులేటి పవన్, పార్సి వేణు, తోలాటి వీరబాబు, పైలా ప్రసాద్ తదితరులు భారీగా అభిమానులతో కలిసి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యారు.
Read...
కాకినాడ / Kakinada 

జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Read...
క్రైమ్  కాకినాడ / Kakinada 

పోలీస్ కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు గంజాయి తరలిస్తున్నదేనని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

పోలీస్ కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు గంజాయి తరలిస్తున్నదేనని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు ఢీకొట్టి ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై వివరాలు వెల్లడించారు. కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహన తనిఖీల్లో కారును నిలువరిస్తుండగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయిందని వెంటనే ఐదు బృందాలుగా దర్యాప్తు చేపట్టి 24 గంటలు తిరగకుండా నిందితుల్ని పట్టుకున్నట్లు తెలిపారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగడ్ కు గంజాయి తరలిస్తుండగా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం పోలవరం కెనాల్ వద్ద కారు స్వాధీనం చేసుకుని ముద్దాయిలు తరుణ్ కుమార్, జాహిద్, ముస్తాకిమ్, మొహమ్మద్ జాకీర్ ను అరెస్టు చేశామన్నారు. ఈ కారులో మూడు బ్యాగుల్లోని 31 ప్యాకెట్లలో రూ. 3.43 లక్షలు విలువ చేసే 68.6 కేజీల గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని కోర్టు లో హాజరు పరుస్తామన్నారు. గాయాల పాలైన కానిస్టేబుల్ లోవరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతన్ని పరామర్శించానన్నారు. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన జగ్గంపేట సిఐ వై ఆర్ కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Read...
పాలిటిక్స్  కాకినాడ / Kakinada 

జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన జగ్గంపేట వైసీపీ నాయకులు

జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన జగ్గంపేట వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జగ్గంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గణేష్ రాజా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశ ప్రధమ సామాజికతత్వవేత్త , సమన్యాయ సత్య బోధకుడు అని, అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడంలో, మహిళలు యొక్క అభ్యున్నతికి పాటుపడడంతో పాటుగా, విద్యారంగంలో, వితంతు మహిళల పట్ల ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం మహాలక్ష్మి, గాది కృష్ణ, అడబాల నాగు, గిడియాల పెద్దకాపు, సాపిరెడ్డి సత్తిబాబు, పల్లపాటి రాజు, పైలా చైతన్య, పైలా నానాజీ, వడ్లపాటి జయబాబు, కాపవరపు సుబ్రహ్మణ్యం, అంబటి చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Read...
ఆధ్యాత్మికం  కాకినాడ / Kakinada 

రేపు నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రం ప్రారంభం

రేపు నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రం ప్రారంభం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శివ పంచాయతన క్షేత్రాన్ని రేపు(గురువారం) జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభిస్తారని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. బుధవారం నాయకంపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్షేత్రంలో నిర్మించిన  సువర్ణ భారతి గోశాల, పాకశాల, ప్రవచన మంటపములు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ అగ్నిహోత్రిని దేవాలయం నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావాలని కోరారు. 
Read...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  కాకినాడ / Kakinada 

గురుకుల పాఠశాలను సందర్శించిన జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి

గురుకుల పాఠశాలను సందర్శించిన జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్  సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శనివారం జగ్గంపేట జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ సందర్శించారు.  ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. బెంచీలు, బెడ్స్...
Read...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  కాకినాడ / Kakinada 

తిరుమల వెంకటేశ్వరున్ని దర్శించుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల

తిరుమల వెంకటేశ్వరున్ని దర్శించుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ  శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం...
Read...

About The Author