వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 26:ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లే వీర వెంకట్ సూచించారు.వర్షాకాలంలో కలుషిత నీరు, కలుషిత ఆహారం, అపరిశుభ్ర వాతావరణం వల్ల విష జ్వరాలు,డెంగ్యూ, టైఫాయిడ్,విరేచనాలు,ఇతర అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా వ్యాధులు ప్రబలకుండా నివారించాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యవసరమన్నారు."చిన్నపాటి జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే ఈ సీజనల్ వ్యాధులు దరి చేరవు," అని వెంకట్ అన్నారు.ఇంతే కాకుండా, గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు మరియు వైద్య సిబ్బంది తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్ల దగ్గర చిన్న పిల్లలు చేరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే మనం పెంచే మూగజీవాలను కూడా అప్రమత్తంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని ఆయన పేర్కొన్నారు.వ్యIMG-20250726-WA0658  వసాయ పనుల్లో పాల్గొంటున్న రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గొర్లే వీర వెంకట్ హితవు పలికారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,