గుబ్బలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తోట

గుబ్బలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తోట

గోకవరం

గోకవరం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆనుకొని ఉన్న గ్రామ దేవత అయిన గుబ్బలమ్మ అమ్మవారిని శనివారం సాయంత్రం జగ్గంపేట వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం సతీమణి తోట వాణి మరియు కోడలు తోట శ్రీనిధి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుబ్బలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నరాల శెట్టి నరసయ్య తోట వాణి, తోట శ్రీ నిధులకు శాలువా కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోట వాణి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట నరసింహం విజయం సాధించి ఎమ్మెల్యేగా నేగ్గాలని మరియు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల స్వీకరించాలని అమ్మవారికి తాను మొక్కుకున్నానని తోట వాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వీరబాబు, సొసైటీ చైర్మన్ దాసరి చినబాబు, వైకాపా ఎస్సీ సెల్ కార్యదర్శి వరసాల ప్రసాద్, కర్రి సురా రెడ్డి, నరాల శెట్టి నరసయ్య, వైకాపా టౌన్ కన్వీనర్ వీర్ల వెంకటేశ్వర్లు, నండూరి బుజ్జి, బాడిత బోయిన చిన్న, అంబటి ప్రసన్న, కొల్లాపు అర్జున్ రావు అనంతరం వారు అక్కడి నుండి తంటికొండ గ్రామం చేరుకుని జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న తోట నరసింహాన్ని గెలిపించాలని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews