ఏజెన్సీ మాలల హక్కులు కాపాడాలి

ఏజెన్సీ మాలల హక్కులు కాపాడాలి

గంగవరం అల్లూరి జిల్లా

భారత రాజ్యాంగం మాలల అభివృద్ధి కోసం నిర్దేశించిన హక్కులను ఏజెన్సీలోని మాలలకు వర్తింపజేయాలని రంపచోడవరం డివిజన్ మాల మహానాడు కన్వీనర్ బొల్లవరపు జయరాజు డిమాండ్ చేశారు. మండలంలోని మొల్లేరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో నివసిస్తున్న మాలలకు గిరిజన చట్టాలకు లోబడి ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింప చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలు నివసిస్తున్న మాలలకు శాశ్వత గృహ నిర్మాణం పథకాలు రుణాలను మంజూరు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, బీసీ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల