మమ్మల్ని మన్నించు బాబా..

మమ్మల్ని మన్నించు బాబా..

 అల్లూరి జిల్లా, చింతపల్లి పెన్ పవర్ మే 26:

అల్లూరు జిల్లాలో జాతీయ రహదారి 516 ఈ నిర్మాణం కారణంగా చాలా గ్రామాల్లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలన్నీటిని తొలగిస్తున్నారు, ఇప్పటికే రింతాడలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్తిగా తొలగించారు దీంతో గ్రామస్తులు విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేశారు, చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ జంక్షన్ పాటు మడిగుంట తదితర ప్రాంతాల్లో పలు ఆలయాలని తొలగించాల్సి వచ్చింది, తాజాగా చింతపల్లి మండల కేంద్రంలో రహదారి విస్తరణ కారణంగా హనుమాన్ జంక్షన్ బ్రహ్మంగారి ఆలయాన్ని, సాయిబాబా ఆలయాన్ని పూర్తిగా తొలగించారు, రహదారి ఆనుకుని ఉన్న సాయిబాబా ఆలయాన్ని పూర్తిగా తొలగించడంతో బాబా విగ్రహాన్ని కొండపై ఉన్న మరో సాయిబాబా ఆలయం మెట్ల వద్ద ఉంచారు, నిన్న మొన్నటి వరకు భక్తులతో పూజలు అందుకున్న దేవత విగ్రహాలు ఇలా దయనీయంగా మూలకి చేరడాన్ని భక్తులు జీవించుకోలేకపోతున్నారు, అయితే జాతీయ రహదారి విస్తరణ భాగంగా అధికారులు ముందుగానే రహదారి విస్తరణ కారణంగా పూర్తిగా తొలగిస్తున్న ఆలయాలను మరోచోట పున నిర్మించేందుకు వీలుగా లక్షలాది రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నారు ఆలయ కమిటీ పేరిట బ్యాంకుల్లో ఎప్పటికీ నిధులను జమ చేశారు,ఈ నిధులతో మరోచోట ఆలయాలను నిర్మించే వరకు దేవత విగ్రహాలు ఇదిగో ఇలా దయనీయంగా ఉండాల్సిందేనా  అని భక్తులు ఆవేదన చెందుతున్నారు నూతన ఆలయాల నిర్మాణానికి స్థల సేకరణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

 

 

 

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల