కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

కాకినాడ

 కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పీతల అచ్యుత రామారావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు శ్రీ కోధి నామ ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఉగాది పంచాగాన్ని ప్రముఖ జ్యోతిష్యులు సాయి సుబ్బారావు  ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు విచ్చేసి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సభ్యులందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా పీతల అచ్యుతరామారావు మాట్లాడుతూ కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు మూడవసారి ఉగాది పండుగ వేడుకలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, సర్వ మతాలకు అతీతంగా ప్రతి పండుగను ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి వేడుకకు సభ్యులందరూ హాజరై విజయవంతం చేయడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని, రాబోవు రోజులలో ప్రెస్ క్లబ్ మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. జర్నలిస్టు మిత్రులందరు సుఖ సంతోషాలతో ఉండాలని, అతి త్వరలోనే జర్నలిస్టు మిత్రులందరికీ ఒక మంచి కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి గునుపే శోభన్ బాబు, ట్రెజరర్ కోనేటి శ్రీనివాసరావు, అడ్వైజరీ కమిటీ  వీధి గోపీనాథ్, సికోటి త్రిమూర్తులు, జాయింట్ సెక్రెటరీ పుర్రెత్రినాథ్, మోర్త బాల కుమార్, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

జనసేన పార్టీ పంచాయతీ కమిటీల ఏర్పాటు పట్ల చర్యలు వేగవంతం:పాడేరు అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీర వెంకట్
బాబుకు షాక్ ఇవ్వనున్న జనసేన-బీజేపీ కూటమి?
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి  ఇద్దరు కు తీవ్ర గాయాలు:విషాదంలో మునిగిన పెంటపాడు గ్రామం
చెరువులో-ప్రభుత్వ భూమిలో.. ఇంటి నెంబర్‌లు..
హుడా" లేఅవుట్‌లో.. ప్రజాప్రయోజనాలు రిజిస్ట్రేషన్‌
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు ప్రసవం పొందండి:స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వాసవి  
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పాడేరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్