ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక

ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక

విజయవాడ

ఎకనామిక్ టైమ్స్ మానవ సంబంధాల అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. శనివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య కళాక్షేత్రం ఆవరణంలో గల బాలోత్సవం లో  వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దాదాపుగా 200 పైగా సభ్యులు హాజరయ్యారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలను మెరుగుపరచడానికి, ఇలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఉంటామని నిర్వాహకులు తెలియజేశారు.

ఈ కార్యక్రమం అంతటినీ ఎకనామిక్ టైమ్స్ ఫౌండర్  అట్లూరి మోషే డేవిడ్ రాజు  దగ్గరుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో ఎకనామిక్ టైమ్స్ మానవ సంబంధాల అభివృద్ధి సొసైటీ అధ్యక్షులు  కందుల ఐజక్  అధ్యక్షత వహించారు. అలానే ఎకనామిక్  టైమ్స్ మహా డెవలప్మెంట్ అధ్యక్షులు  తాళ్లూరి రాము, సెక్రటరీ శ్రీమతి కాట్రు ప్రశాంతి , గౌరవ సలహాదారులు  కె.బాబు కిషోర్, జి.శరత్ లు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం, విశాఖపట్నం రాజమండ్రి ఒంగోలు తిరుపతి మరియు హైదరాబాద్ లో కూడా దిగ్విజయంగా నిర్వహించామని, త్వరలో అన్ని జిల్లాల్లో  ఈ వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా  ఎకనమిక్ టైమ్స్  నిర్వాహకులు తెలియజేశారు..

Tags:

About The Author

Related Posts