ఉదయగిరి టు భైరవకోన బస్సు సర్వీస్ ప్రారంభం

udayagiri-to-bhairavakona-via-siddheshwaram-bus-service-start

ఉదయగిరి టు భైరవకోన బస్సు సర్వీస్ ప్రారంభం

భక్తుల సౌకర్యార్థం, బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి పెన్ పవర్ ఫిబ్రవరి 17 

ఉదయగిరి టు బైరవకోన వయా సిద్దేశ్వరం బస్సు సర్వీసును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం, సిద్దేశ్వరం మరియు భైరవకోనను పర్యాటక కేంద్రంగా, అభివృద్ధి చేసుకునే క్రమంలో, బస్సు సర్వీసును  ప్రారంభించారు. ముందుగా పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, బస్సు ద్వారం దగ్గర రిబ్బన్ కటింగ్ చేసి, జెండా ఊపి, బస్సు ను స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 

2

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో, భక్తుల కోరిక మేరకు, అవసరం దృష్ట్యా బస్సు సర్వీసును, ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సర్వీసు వారంలో ఒక్కరోజు అనగా సోమవారం ఉదయం 7:30 గంటలకు ఉదయగిరిలో బయలుదేరి సిద్దేశ్వరం వెళ్లి అక్కడ నుండి నేరుగా భైరవకోనకు చేరుకుంటుంది. అక్కడ గంట వ్యవధి తర్వాత తిరిగి ఉదయగిరి కి చేరుకుంటుంది. కనుక ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. గత ఎనిమిది నెలల కాలంలో ఉదయగిరి డిపో మేనేజర్ శ్రీనివాసరావు సహకారంతో అనేక ప్రాంతాలకు బస్సు సర్వీసులను పున్వర్ధించినట్లు తెలిపారు.

3

 

ఉదయగిరి కూటమి నాయకుల, సారథ్యంలో మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, బిజెపి ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి కదిరి రంగారావు, సీనియర్ నాయకులు ముడమాల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల