శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నూతన సిఆర్ఓ కార్యాలయం ప్రారంభం.

శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నూతన సిఆర్ఓ కార్యాలయం ప్రారంభం.

శ్రీ కాళహస్తి.

శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణంలో నాలుగవ గేటు వద్ద నూతన సిఆర్ఓ కార్యాలయాన్ని శనివారం లాంఛనంగా ఆలయ ఈవో నాగేశ్వరరావు, పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం సి ఆర్ ఓ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో నాగేశ్వరరావు, పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, సంయుక్తంగా మాట్లాడుతూ. సి ఆర్ ఓ కార్యాలయం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణంలోని నాలుగో గేటు నందు నూతనంగా సి ఆర్ వో కార్యాలయాన్ని ప్రారంభించామని,సిఆర్ఓ కార్యాలయం ద్వారా భక్తుల వసతికి కావలసిన విడిది గృహాలు, అలయంలో ప్రతిరోజూ నిర్వహించే అభిషేకం,పుజా కార్యక్రమాలు సమాచారం లభ్యమవుతుందని తెలిపారు. ఈ ప్రాంతం నందు సిఆర్ఓ కార్యాలయం ప్రారంభించడం ద్వారా భక్తులకు ఆనువుగా ఉంటుందని కావున  భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుకరత్నం తదితర అధికారు ఉద్యోగ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts