మోదకొండమ్మ ఆలయ కమిటీ పై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాజకీయాలు చేయటం తగదు :పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వర రాజు 

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జులై 21: గిరిజనుల ఇలవేల్పు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయం విషయంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాద్ధాంతం చేయటం సరైన పద్ధతి కాదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు అన్నారు.ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి వస్తున్న ఆనవాయితీనే తాను ఎమ్మెల్యే అయినా తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తీరుకోలేక ఏవేవో ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు.గతానికి భిన్నంగా అమ్మవారి ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా తాము కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు స్పష్టం చేశారు.గతంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఆలయ చైర్మన్ గా పని చేశారని ఆ మాత్రం నిబంధనలు ఆమెకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.మతిభ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మోదకొండమ్మ అమ్మవారిని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నాయుడు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్ కుమార్,

IMG-20240721-WA1105
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు

నాయకులు బోనంగి రమణ, తమర్బ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల