ధైర్యంగా ఉండండి - అండగా ఉంటాం:రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి  

IMG-20240730-WA0880
నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శిరీష దేవి

స్టాప్ రిపోర్టర్,పాడేరు/కూనవరం,గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై 30:వరద ముంపు బాధితులు అందరూ ధైర్యంగా ఉండాలని వారందరికీ అండగా ఉంటామని రంపచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి బాధితులకు ధైర్యాన్ని అందించారు.నగదు బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల కొంత సమస్య ఉన్నప్పటికీ,వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఇక్కడే ఉండి సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాల సిద్ధంగా ఉందని, అర్హత గల వారందరినీ గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు పూర్తి చేసి వారిని వీలైనంత త్వరగా పంపించే ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ ఇదివరకు ఏ కలెక్టర్ చేయని విధంగా గత పది రోజులుగా చింతూరు లోనే మకాం వేసి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ముంపు సమయంలో బాధితులు ధైర్యంగా, సహనంగా ఉండాలని సూచించారు.జిల్లాస్థాయి అధికారులు అందరూ ఇక్కడే ఉండి బాధితులకు అవగాహన కల్పిస్తూ, ధైర్యాన్ని నూరి పోస్తున్నారని బాధితులకు అండగా ఉంటున్నారని వారి సేవలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నారని కలెక్టర్ ను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ముంపు మండలాల నోడల్ అధికారులు సూరజ్ గనోరే, కావూరి చైతన్య, చింతూరు ఏ ఎస్ పి రాహుల్ మీనా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం,పలువురు జిల్లా అధికారులు,డివిజనల్ అధికారులు,మండల తహసీల్దార్,ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల