పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు 

IMG-20240822-WA0799
పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు 

 స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 22: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిని పాడేరు శాసనసభ్యులు మత్స్యరస విశ్వేశ్వర రాజు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ పి. విశ్వామిత్రకు ఆసుపత్రిలో అందిస్తున్నటువంటి వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు వైద్యం సరిగ్గా అందించటం లేదని చాలామంది తమకు ఫిర్యాదు చేస్తున్నారని,ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సూపర్డెంట్ కు ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల