బిఎస్ఎన్ఎల్ డిఓటి ఫన్షనర్స్ అసోసియేషన్ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జులై 10 : విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బుధవారం అఖిలభారత బిఎస్ఎన్ఎల్ డిఓటి పెన్షనర్స్ అసోసియేషన్ ఐదవ మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనూజ రాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పూలదండ వేసి జ్ఞాపిక అందజేసి దుస్సాలువతో సన్మానించారు. పెండింగ్లో ఉన్న అదనపు ఇంక్రిమెంట్ లేకుండా 78.2% పెన్షన్ రివిజన్ తుది పరిష్కారం కొరకు కృషి చేయాలని పెన్షనర్లు ఎంపీ తనూజ రాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మా తండ్రి బిఎస్ఎన్ఎల్ శాఖ ఉద్యోగిగా ఉంటూ మాకు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దారని మీ యొక్క అసోసియేషన్ సమస్యల కొరకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం వి ఎస్ శర్మ, ఐ టి ఎస్ ప్రిన్సిపాల్ జిఎం,పాల్ విలియమ్స్, ఐ టి ఎస్ ప్రిన్సిపాల్ జిఎం పి ఆడమ్స్, కె ఎస్ సి బోస్, చంద్రశేఖర్, అసోసియేషన్ కమిటీ సభ్యుడు ఎంపీ తండ్రి గుమ్మ శ్యాంసుందర్ రావు, అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆఫీస్ బేరర్లు,సర్కిల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.IMG-20240710-WA0769

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల