అల్లూరి జిల్లా చింతపల్లిలో "ఆకాశవాణి ఎఫ్ ఎం" కేంద్రం ఏర్పాటు!

అల్లూరి జిల్లా చింతపల్లిలో

✒️12.5 కోట్ల నిధుల మంజూరు!

స్టాప్ రిపోర్టర్,పాడేరు చింతపల్లి, జులై 16: పెన్ పవర్ న్యూస్:IMG-20240716-WA0829  

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 12.5 కోట్ల నిధులను మంజూరు చేసింది.కొండ శిఖర ప్రాంతాలకు ఆకాశవాణి సేవలు అందుబాటులోనికి రాకపోవడంతో ఈ విషయం ఆకాశవాణి కేంద్రం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.దీంతో చింతపల్లి కేంద్రంగా ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో ఆల్ ఇండియా రేడియో అధికారులు చింతపల్లి ప్రాంతానికి వచ్చి ఆకాశవాణి కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసి పనులకు రంగం సిద్ధం చేస్తున్నారు.దీంతో మరికొద్ది రోజుల్లో అల్లూరి జిల్లా మన్యం ప్రజలకు ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోనికి రానున్నాయి ఆదివాసి ప్రజలకు వినోదాన్ని పంచేందుకు ఆకాశవాణి అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. చింతపల్లి ప్రధాన కేంద్రంగా ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వలన సుమారు అల్లూరి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఆకాశవాణి సేవలు అందుబాటులోనికి రానున్నాయి.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల