సీలేరు వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి

👉

IMG-20240716-WA0001
ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు

గాలికొండ ఎంపిటిసి అంపురంగి బుజ్జిబాబు  

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై16:చిన్నారుల తల్లిదండ్రులపై కేకలు వేసిన సీలేరు వైద్యాధికారి పై చర్యలు తీసుకోవాలని గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు డిమాండ్ చేశారు.స్థానిక విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ జీకే వీధి మండలం సీలేరులో నివాసం ఉంటున్న స్వామి రమణ కుమారులు ఇద్దరు కు వాంతులు విరోచనాలు జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు వైద్య సేవ నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో నర్స్ పిల్లలు అనారోగ్య పరిస్థితి పై ఫోన్ చేసి వైద్యాధికారికి వివరించింది.వైద్యాధికారి వారి స్థితిగతులపై అడగకుండా వైద్య సేవలు అందించడానికి సత్వర చర్యలు చేపట్టకుండా వైద్య అధికారి తల్లిదండ్రులపై కేకలు వేయడం ఎంతవరకు సమంజసమని బుజ్జిబాబు ప్రశ్నించారు.ఇంత రాత్రి పై తీసుకురావడం ఏమిటని వైద్య అధికారి ఆసుపత్రికి వచ్చి చిన్నారులకు వైద్య సేవలు అందించకుండా ఘర్షణకు దిగడం సరి కాదన్నారు.దీన్ని బట్టి చూస్తే ఏజెన్సీ ప్రాంతం ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు ఎంత బాగా అందుతున్నాయో దీన్ని బట్టి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంపై కలెక్టర్ స్పందించి డాక్టర్ పై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ బుజ్జిబాబు డిమాండ్ చేశారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల