రింతడా సచివాలయం లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం
ఎంపీడీఓ బి హెచ్ వి రమణ బాబు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఫిబ్రవరి 20:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ సచివాలయం వద్ద ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల లక్ష్యాలు, అర్హత ప్రమాణాలు, లబ్ధిదారుల ఎంపిక విధానం తదితర అంశాలను గ్రామస్తులకు వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో జగదీష్, ఆర్డబ్ల్యూఎస్ జెఈ కళ్యాణ్ బాబు, ఈవోపిఆర్డి కిట్లంగి బాలకృష్ణ, పంచాయితీ కార్యదర్శి అరుణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పథకాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, సమర్థతకు అధికారులు కట్టుబడి ఉన్నారని ఎంపీడీవో తెలిపారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
