చింతపల్లిలో గ్యాస్ ఈ కేవైసీ కోసం ఉదయం నుండే క్యూ లైన్ లో..

చింతపల్లిలో గ్యాస్ ఈ కేవైసీ కోసం ఉదయం నుండే క్యూ లైన్ లో..

స్టాప్ రిపోర్టర్ పాడేరు/ చింతపల్లి,జులై18 పెన్ పవర్ న్యూస్:

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి జిసిసి కార్యాలయం వద్ద గ్యాస్ కార్యాలయంలో గ్యాస్ ఈ కేవైసీ కొరకు గ్యాస్ లబ్ధిదారులు ఉదయం నుండే క్యూ లైన్ లో నుంచొని ఎదురుచూస్తున్నారు. కార్యాలయం తెరిసే సమయానికన్న ముందే వచ్చి లబ్ధిదారులు క్యూలో నించొని ఉంటున్నారు. ప్రభుత్వం గ్యాస్ లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించడంతో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి అని లబ్ధిదారులు ఆశగా ఈకేవైసీ చేయించుకుంటున్నారు.గ్యాస్ ఈ కేవైసీకి తుది గడువు అయిపోతుందోమో అన్నా భయంతో దూర ప్రాంతాల నుండి ప్రజలు ఉదయకాలనే వచ్చి గ్యాస్ కార్యాలయంలో వేచి చూస్తున్నారు.

IMG_20240718_090557
జిసిసి గ్యాస్ కార్యాలయంలో ఈ కేవైసీ కోసం క్యూ లైన్ లో లబ్ధిదారులు

గ్యాస్ ఈ కేవైసీ పంచాయతీ కేంద్రాల్లో, సచివాలయాల్లో కూడా చేయాలని,దీనివల్ల రద్దీ తగ్గి లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవటానికి అవకాశం ఉంటుందని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు.

Tags: #news

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల