సీనియర్ మెగా వాలీబాల్ టోర్నీ:ప్రారంభించిన సర్పంచ్ పెట్టెలి దాసుబాబు 

అరకులోయ పెన్ పవర్ 9 :సీనియర్ క్రీడాకారుల స్మారక మెగా వాలీబాల్ టోర్నమెంట్ 2024 అరకువేలీ క్రీడా మైదానంలో బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి ఆదివారం వరకు మూడు రోజులు పాటు సాగే క్రీడా పోటీల్లో పాడేరు డివిజన్లోని 11 మండలాల సీనియర్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడా పోటీలను పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ఎంపీపీ రంజిపల్లి ఉషారాణి, జడ్పిటిసి శెట్టి రోషిణి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ దాసుబాబు మాట్లాడుతూ సీనియర్ క్రీడాకారుల స్మారక మెగా వాలీబాల్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ టోర్నీ ఏర్పాటుచేసిన కమిటీకి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 11 మండలాల్లో ఉన్న వాలీబాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను నిరూపించుకునేందుకు తహతహలాడుతుండడం ఎంతో సంతోషదాయకమన్నారు.రూ. 30,000 రూ.20,000 రూ.10000 బహుమతులు గెలుచుకోవాలనే తపన కంటే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఎంతమంది క్రీడాకారులను ఇక్కడ వరకు తీసుకొచ్చిందన్నారు. మరోసారి అనేకమంది క్రీడాకారుల కలయికకు ఈ టోర్నీ వేదిక అయిందని పేర్కొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి తనను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

IMG-20241009-WA0712 .

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల