ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి:పాడేరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్: వనుము చిట్టబ్బాయి  

IMG-20240722-WA0004
హెల్మెట్ యొక్క అవశ్యకతను విద్యార్థులకు వివరిస్తూ

 స్టాప్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి, పెన్ పవర్,జూలై 22: ఉన్నత విద్యా కమిషన్ వారి ఆదేశాల మేరకు పాడేరు డిగ్రీ కళాశాల యందు జాతీయ సేవ పథకం ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి, శిరస్త్రానము( హెల్మెట్ ) ధరించటం వల్ల కలిగే ఉపయోగం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వనుముు చిట్టబ్బాయిి మాట్లాడుతూ విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు నడిపిన వారు, కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం వలన అనుకోని ప్రమాదం జరిగితే తలకు గాయాలు కాకుండా రక్షణ ఏర్పడి ప్రాణాలు కాపాడుకోవచ్చునని తెలిపారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోవాలని సూచించారు.ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఎన్ఎస్ఎస్ వాలంటర్ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి.రమేష్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని,వాలంటీర్లు తరచూ ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి.గౌరీ శంకర్,జి.దామోదర్,గణేష్,భాస్కర్,వి.శంకర్రావు,జి.గోవిందరావు,సౌజన్య,నిర్మల,సుమిత్ర,జానకిరామ్,అచ్యుత్ ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల