ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు గ్రామాలలో ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు ప్రజలను కోరారు. గ్రామాలలో సందర్శనలో భాగంగా మండలంలోని సలకలవీడు గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై నరసింహారావు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతుందన్నారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎన్నికల ప్రశాంత వాతావరణానికి ఎటువంటి భంగం కలిగించినా, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో శాంతిభద్ర తలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా, వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని ఎస్సైనరసింహారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల