వలేటివారిపాలెం లో ఆత్మీయ సమావేశం

వలేటివారిపాలెం లో ఆత్మీయ సమావేశం

నేడు సాయంత్రం 4-00గంటలకు స్థానిక వలేటివారిపాలెం లో జరుగనున్న వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి  మరియు కందుకూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్  వస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మండలకేంద్రం లోని గాంధీ నగర్ నుండి అగ్రహారం రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి  అనంతరం వలేటివారిపాలెం వైసీపీపార్టీ కార్యాలయంలో వైసీపీనాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కావున మండలంలోని అన్ని గ్రామాల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

About The Author

Related Posts