CHIRANJEEVI VADTHYA

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఉషారాణి

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఉషారాణి యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఉషారాణి వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్, నో ఆల్కాహాల్, నో డ్రంక్ అండ్ డ్రైవ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఉషారాణి హైదరాబాద్ పెన్ పవర్ డిసెంబర్ 02 : డ్రగ్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. అందులో భాగంగా వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో సమరాన్ని ప్రకటించింది. వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ భారత ప్రసాద్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్, మద్యం నుండి యువతను కాపాడుకుందాం.. నవభారతాన్ని నిర్మించుకుందాం...పేరుతో రూపొందించిన పోస్టర్ ను వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ డిప్యూటీ చైర్మెన్ కె.ఉషారాణి మంగళవారం వారి నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులు పూర్తికాగానే యువత భవిష్యత్తుపై దృష్టి సారించకుండా చెడు వ్యసనాల వైపు వెళ్తూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. చదువులు పూర్తికాగానే ఉద్యోగాలు, వ్యాపారాలపై దృష్టి సారిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా కొంతమంది యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత డ్రగ్స్, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ భారత ప్రసాద్ చేస్తున్న పోరాటాన్ని ఆమె ప్రశంసించారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు.  యువతలో అవగాహన కల్పిస్తాం: భారత ప్రసాద్    యువత డ్రగ్స్ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా వారికి కావాల్సిన అవగాహనను కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ భారత ప్రసాద్ తెలిపారు. రానున్న డిసెంబర్ 31వ తేదీ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత డ్రగ్స్, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా త్వరలో పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తూ చైతన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు కళాశాలలు, పాఠశాలలు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read...

గట్టుమీద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రమావత్ సోనా శంకర్ నాయక్ నామినేషన్

గట్టుమీద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రమావత్ సోనా శంకర్ నాయక్ నామినేషన్ గట్టుమీద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రమావత్ సోనా శంకర్ నాయక్ నామినేషన్ నల్గొండ పెన్ పవర్ డిసెంబర్ 01: తిరుమలగిరి (సాగర్ ) మండలం లోని గట్టుమీద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి రమావత్ సోనా శంకర్ నాయక్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమం లో పరశురాం, హరిచంద్, జవర్ లాల్, రమేష్, హరి, సాయి రాథోడ్ తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
Read...

శ్రీశైల క్షేత్రానికి తరలిన శివ స్వాములు

శ్రీశైల క్షేత్రానికి తరలిన శివ స్వాములు శ్రీశైల క్షేత్రానికి తరలిన శివ స్వాములు  శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయ పరిసరాలు శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ ఎల్బీనగర్, పెన్ పవర్ డిసెంబర్ 01: శివమాల ధారణ చేసిన స్వాములు మండల కాలం పాటు దీక్షలు పూర్తి చేసుకుని సోమవారం ఉదయం ఇరుముడులు కట్టుకొని ఆ శివయ్య దర్శనార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు, సాహెబ్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీన వందలాదిమంది శివ స్వాములకు మాలధారణ చేయించారు. మండల కాలం పాటు దీక్షలు చేసిన స్వాములకు సోమవారం వనస్థలిపురం సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు ఇరుముడులు కట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులో ఆ శివయ్య దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి తరలివెళ్లారు ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు ఓం నమ: శివాయ నామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి మాట్లాడుతూ శివ మాలధారణ చేసే స్వాములకు నూతన వస్త్రాల పంపిణీ, మాలాధారణ కిట్టు అందజేయడం జరిగిందని తెలిపారు. మండల కాలం పాటు శివ స్వాములు, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు, భవాని స్వాములు, వందలాది మందికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. మండల కాలం పాటు దీక్షలు పూర్తి చేసుకున్న స్వాములకు ఇరుముడులు కట్టించి ఆర్టీసీ ప్రత్యేక బస్సులో స్వాములను శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. శివ నామాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఎనలేని కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతియేడు శివ మాలధారణ చేసే స్వాములకు ఉచితంగా నూతన వస్త్రాలు, మాలలు అందజేసి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీశైల క్షేత్రానికి తరలివెళ్ళిన వారిలో శివస్వాములు, దేవాలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
Read...

డ్రగ్స్‌పై సమరం : భారత ప్రసాద్‌

డ్రగ్స్‌పై సమరం : భారత ప్రసాద్‌ డ్రగ్స్‌పై సమరం : భారత ప్రసాద్‌ హైదరాబాద్‌ పెన్ పవర్ నవంబర్ 28: డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు యువత నడుం బిగించాలని వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్‌ భారత ప్రసాద్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రానున్న నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌, మత్తు పదర్థాలను వాడొద్దని కోరుతూ వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే డ్రగ్స్‌, మత్తు పదర్థాలపై యువతను చైతన్యపరుస్తూ పోస్టర్ల ద్వారా ప్రచారాన్ని చేపడుతూ వారిలో అవగాహన కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అన్నారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, వైన్స్‌ షాపుల యజమానులు సైతం ఈ పోరాటానికి సహకరించాలని ఆయన కోరారు. నో డ్రగ్స్‌, నో ఆల్కాహాల్‌, నో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పేరుతో త్వరలోనే పోస్టర్లను రూపొందిస్తున్నామని తెలిపారు. యువతకు అవగాహన కల్పించే విషయంలో సంబంధిత ప్రభుత్వ అధికారులను కలిసి వారి ద్వారా కూడా చైతన్యం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాము చేపట్టనున్న ఈ సమరానికి ప్రతిఒక్కరూ సహకరించాలని భారత ప్రసాద్‌ కోరారు.
Read...

చలకుర్తి చిన్నారుల ఖాతాలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

చలకుర్తి చిన్నారుల ఖాతాలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చలకుర్తి చిన్నారుల ఖాతాలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హైదరాబాద్ పెన్ పవర్ నవంబర్ 23: నగరం లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియం లో నిర్వహించిన *లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్* నందు పాల్గొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడంలో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సంతోష్ కుమార్, ప్రియాంక ల కుమార్తె పాతనబోయిన సుదీక్ష , కుమారుడు పాతనబోయిన విహాస్ భాగస్వామ్యులు అయ్యారు. ఇట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు తెలంగాణ కు చెందిన పలువురు మార్షల్ ఆర్ట్స్ కరాటే , టెక్వాండో , కుంగ్ ఫూ క్రీడాకారులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ ఇట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని, ఇట్టి రికార్డ్ తమపై మరింత బాధ్యత కూడా పెంచిందని మునుముందు మరింత కఠోరశ్రమతో సాధన చేసి మరెన్నో రికార్డులు సాధించి తల్లితండ్రులకు, పుట్టిన ఊరికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకువస్తామని , చిన్ననాటి నుండే శిక్షణ ఇప్పించి నిరంతరం తమవెంట ఉండి నడిపిస్తున్న తల్లితండ్రులకు, శిక్షణలో మెళకువలు నేర్పించి మంచి మంచి అవకాశాలు ఏర్పాటు చేసిన కోచ్ మహేష్ నాయక్ మాస్టర్ , శివ మాస్టర్ , ఆర్.మహేష్ మాస్టర్ లకు ధన్యవాదాలు తెలియచేశారు.
Read...

అంగరంగ వైభవంగా సిటీ కళాశాలలో స్త్రీ శక్తి దివాస్ వేడుకలు:

అంగరంగ వైభవంగా సిటీ కళాశాలలో స్త్రీ శక్తి దివాస్  వేడుకలు: అంగరంగ వైభవంగా సిటీ కళాశాలలో స్త్రీ శక్తి దివాస్ వేడుకలు హైదరాబాద్ పెన్ పవర్ నవంబర్ 19:  సిటీ కళాశాల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి స్త్రీ శక్తి దివాస్ వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎబివిపి అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న వీర వనిత ఝాన్సీ లక్ష్మి బాయి నేడు ఆమె చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం అని ఈ కాలంలో ప్రతి ఒక్క స్త్రీ ఝాన్సీ లక్ష్మీబాయి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శంకర్ , శిరీష , రామ్ కుమార్, కళాశాల సెక్రటరీ శివమణి మరియు విద్యార్థి నాయకులు అంజి, సాగర్, రాహుల్, గణేష్, మరియు తదితర విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Read...

ఘనంగా అన్న ప్రసాద వితరణ : ముద్దగౌని సతీష్ గౌడ్

ఘనంగా అన్న ప్రసాద వితరణ : ముద్దగౌని సతీష్ గౌడ్ ఘనంగా అన్న ప్రసాద వితరణ : ముద్దగౌని సతీష్ గౌడ్  సతీష్ గురుస్వామి ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం  భారీ సంఖ్యలో పాల్గొన్న స్వాములు, భక్తులు  ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కే. కోటేశ్వరరావు ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 27  శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి గత 15 సంవత్సరాలుగా శివ స్వాములకు ఉచిత మాలాధారణ, 41 రోజుల వసతి, నిత్యాన్నదానం చేపడుతున్నారు. అదేవిధంగా ఈ సోమవారం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ జోన్ అడిషనల్ డీసీపీ కే. కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అంతకుముందు అడిషనల్ డీసీపీని సతీష్ గురుస్వామి, వారి స్వాముల బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ సతీష్ గురుస్వామి చేస్తున్న సేవలను కొనియాడారు. ముందు ముందు ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. తమను ఆహ్వానించి స్వామివారి సేవలో భాగం చేసినందుకు సతీష్ గురుస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.  *సతీష్ గురుస్వామి మాట్లాడుతూ...* శివతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా శ్రీ మల్లికార్జున భక్త సమాజం పనిచేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఉచిత మాలధారణ నిత్యాన్నదానం కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ చూపించిన మార్గంలో వెళ్తూ శివతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అతి త్వరలో 1000 మంది శివ స్వాములతో కాలినడకన శ్రీశైలానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
Read...

మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన

మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన    మియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో జరిగిన బనోత్ నగేష్ అనుమానాస్పద మరణంపై జాతీయ ఎస్టీ కమిషన్ చర్య హైదరాబాద్ పెన్ పవర్ అక్టోబర్ 22 ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, మియాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో మరణించిన బనోత్ నగేష్ (ఖమ్మం జిల్లా -యోనెకుంట తండా) కేసుపై జాతీయ ఎస్టి కమిషన్ (NCST) విచారణ ప్రారంభించింది. ఈ మేరకు, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అక్టోబర్ 7, 2025 న నోటీసు జారీచేసి, 15 రోజుల్లోపు కేసు పురోగతి, చర్యల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సమాధానం రాకపోతే, సివిల్ కోర్టు అధికారాలతో సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.
Read...

శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్

శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ శివ మాలధారణ చేసిన సతీష్ కుమార్ గౌడ్, స్వాములు ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిత్యాన్నదానం ఎల్బీనగర్ పెన్ పవర్ అక్టోబర్ 22 శివ తత్వాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు తమవంతు కృషి చేస్తున్నామని శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు, సాహెబ్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో బుధవారం ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి శివ మాలధారణ చేసి సుమారు 48 మంది స్వాములకు మాలలు వేశారు. అనంతరం దేవాలయంలో శివుడికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లుగా శివ మాలధారణ చేసి మండల కాలం పాటు దీక్షలు చేస్తున్నామని తెలిపారు. మాలధారణ చేసిన వందలాది మంది స్వాములకు దేవాలయ ప్రాంగణంలో ప్రతియేడు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతినిత్యం వందలాది మంది స్వాములకు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమతోపాటు మండల కాలం పాటు దీక్షలు పూర్తయిన తరువాత స్వాములకు దేవాలయ ప్రాంగణంలో ఇరుముడులు కట్టించి వాహనాల్లో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లి తన సొంత ఖర్చులతో ఉచితంగా స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు వసతిని కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. శివ మాలధారణ మండలం కాలం, అర్థ మండలం కాలం పాటు వేసుకోవచ్చునని ఆయన తెలిపారు. దీంతోపాటు శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి తనవంతు చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో శివ స్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు.
Read...

తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన

తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన నాలుగు వారాల్లో చర్యా నివేదిక సమర్పించాలని ఆదేశం హైదరాబాద్ పెన్ పవర్ అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో రాజకీయ వేధింపుల కారణంగా జరిగినదిగా ఆరోపణలు ఉన్న ఆత్మహత్య కేసుపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) స్పూర్తిదాయక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు మంచిర్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు (SP) ఆదేశాలు జారీ చేసి, నాలుగు వారాల్లో చర్యా నివేదిక (ATR) సమర్పించాలని సూచించింది. ఈ ఫిర్యాదును న్యాయ శాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ 12 అక్టోబర్ 2025న ఎన్‌హెచ్ఆర్సీకి సమర్పించారు. మానవ హక్కుల సంఘం 17 అక్టోబర్ 2025న ఈ ఫిర్యాదును పరిశీలించి విచారణకు స్వీకరించింది. ఫిర్యాదుదారు పేర్కొన్న ప్రకారం, కొందరు ప్రత్యర్థి కాంగ్రెస్ నేతల మానసిక వేధింపుల కారణంగా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా, బాధితుడికి న్యాయం చేయాలని, నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కేసు మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు రాజకీయ వేధింపుల కోణంలో సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు ఎన్‌హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.
Read...

అనాథ విద్యార్థినులను తీర్థ యాత్రలకు పంపిన భీష్మరాజ్ ఫౌండేషన్

అనాథ విద్యార్థినులను తీర్థ యాత్రలకు పంపిన భీష్మరాజ్ ఫౌండేషన్ ’పేట'లో బస్సును ప్రారంభించిన ఆర్టీసీ డీఎం లావణ్య భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన డీఎం సేవా రంగాల్లో ముందంజ: ఫౌండేషన్ సభ్యులు నారాయణపేట, పెన్ పవర్: సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహానికి చెందిన అనాథ విద్యార్థినులను, సిబ్బందిని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో సంబంధిత అధికారులు తీర్థ యాత్రకు తీసుకెళ్లారు. తీర్థ యాత్రకు సంబంధించిన బస్సును శనివారం ఉదయం నారాయణపేట బారంబాయిలోని సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహం వద్ద భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణపేటలో ఉన్న సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహానికి చెందిన అనాథ విద్యార్థినులను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆర్థిక సహకారంతో వారిని తీర్థ యాత్రకు తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు.  *సేవా కార్యక్రమాల్లో ముందంజ*    అందరి మాదిరిగానే అనాథ విద్యార్థినులకు కూడా అన్ని ప్రదేశాలు, తీర్థ యాత్రలకు వెళ్లాలని ఉంటుందని, వసతి గృహం నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి  చర్యలు చేపట్టి వారిని తీర్థ యాత్రకు పంపించడం జరిగిందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ ఫౌండేషన్ ముందుకు సాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్రీధర్, సురేష్, హన్మంతు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, శివరాజ్, సుదర్శన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, మిస్కిన్ సంతోష్, వెంకటరావు, వై.సంతోష్, అశోక్, నందుకుమార్, చామకూర నగేష్, కృష్ణ యాదవ్, మన్నె గోపాల్, శ్రీనివాస్, సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహం అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
Read...

About The Author