CHIRANJEEVI VADTHYA

కోదాడ లాకప్ డెత్ ఘటన: ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

కోదాడ లాకప్ డెత్ ఘటన: ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ కోదాడ లాకప్ డెత్ ఘటన: ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్,  మేజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు హైదరాబాద్ పెన్ పవర్ జనవరి 24: సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకున్న దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను అత్యంత గంభీరంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, మేజిస్టీరియల్ విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ తెలంగాణ డీజీపీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ నెలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ కర్ల రాజేష్ కోదాడ పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజేష్‌ను కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అక్కడ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కలిసి రాజేష్‌పై అమానుషంగా దాడులు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక కర్ల రాజేష్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ లాకప్ డెత్ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీలో లా విద్యను అభ్యసిస్తున్న, రంగారెడ్డి జిల్లాకు చెందిన సభావత్ కళ్యాణ్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధితుడికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సభావత్ కళ్యాణ్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల లోపు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి చర్యల నివేదికతో పాటు, మేజిస్టీరియల్ విచారణ నివేదికను కూడా సమర్పించాలని స్పష్టంగా పేర్కొంది. లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, మానవ హక్కుల ఉల్లంఘనలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై ప్రభుత్వ చర్యలు, విచారణ ఫలితాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
Read...

ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు

ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు హైదరాబాద్ పెన్ పవర్ జనవరి 23:   సిటీ కళాశాలలో ఎబివిపి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతినీ జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎబివిపి అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమ చాలా గొప్పదని, ఆజాద్ హింద్ పౌజ్ తో బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెతించాడు అని అన్నారు. సుభాష్ చంద్రబోస్ "నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి , నేను మీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెడతాను" అన్నా మాటలు ఆనాడు ఎందరినో స్వతంత్ర్యం సాధించాలనే ఆకాంక్ష వైపు నడిపింది అని, నేతాజీ ఎందరికో యుద్ధ కాంక్ష ను రగిలించారు అని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు శంకర్, భాస్కర్ , శ్రీశైలం మరియు ఎబివిపి విద్యార్థి నాయకులు ప్రశాంత్, రాహుల్, గణేష్,శంకర్, అరుణ్, పింకీ, షర్మిల తదితర విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Read...

రాజేష్ కస్టడీ మృతి కేసులో డీజీపీ, కలెక్టర్, ఎస్పీకి NHRC నోటీసులు

రాజేష్ కస్టడీ మృతి కేసులో డీజీపీ, కలెక్టర్, ఎస్పీకి NHRC నోటీసులు రాజేష్ కస్టడీ మృతి కేసులో డీజీపీ, కలెక్టర్, ఎస్పీకి NHRC నోటీసులు హైదరాబాద్ పెన్ పవర్ జనవరి 23: తెలంగాణ, సూర్యాపేట జిల్లా కు చెందిన రాజేష్ కస్టడీ మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలకంగా స్పందించింది. ఈ ఘటనపై ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ చేసిన ఫిర్యాదు మేరకు NHRC ఈ కేసును స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు సూర్యాపేట ఎస్పీలకు ఎనిమిది వారాల్లో పూర్తి చర్యల నివేదిక (Action Taken Report – ATR) సమర్పించాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. కస్టడీలో రాజేష్ మరణానికి దారి తీసిన పరిస్థితులు, చట్టపరమైన నిబంధనల అమలు, మానవ హక్కుల పరిరక్షణ చర్యలపై సమగ్ర వివరాలు నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. కస్టడీ మరణాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా మారుతున్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మౌలిక మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకత, బాధ్యత, చట్టపాలనను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Read...

ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: మల్ రెడ్డి రాంరెడ్డి

ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: మల్ రెడ్డి రాంరెడ్డి ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: మల్ రెడ్డి రాంరెడ్డి ఈ విషయమై స్థానికులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించిన మల్ రెడ్డి రాంరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఎల్బీనగర్ పెన్ పవర్ జనవరి 09: ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి కోరారు. ఎల్బీనగర్ ను ఇతర డివిజన్లలో కలపకుండా ఎల్బీనగర్ ను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎల్బీనగర్ వాసులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ లో కొంత భాగాన్ని ఇతర డివిజన్ లో కలిపిన విషయమై ఎల్బీనగర్ వాసులు తనను కలిసి విన్నవించారని తెలిపారు. ఈ విషయమై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామినిచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆడాల రమేష్, స్థానికులు నిమ్మలూరి శ్రీనివాస్, ఎండీ జానిమియా, అల్లి భాస్కర్ యాదవ్, గుండెల కిరణ్ కుమార్, రాజ్ కుమార్, చంద్రశేఖర్, మెట్టు జీవన్ రెడ్డి, అరుణ్, అంబేద్కర్, చంద్ర శేఖర్ రెడ్డి, గుర్రం సతీష్, రాజు గౌడ్, ఆనంద్, కన్నా, జయంత్, కిట్టు, భానుచందర్, గోపి, అస్సాం, గణేష్ తదితరులు ఉన్నారు.
Read...

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ నల్గొండ, తిరుమలగిరి (సాగర్): పెన్ పవర్, జనవరి 05 గట్టుమీద తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రమావత్ సోనీ శంకర్ నాయక్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య సానుకూల వాతావరణంలో సమావేశం జరిగింది. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో శంకరన్న టీం సభ్యులు సభావత్ శీను, రమావత్ బాలు, రమావత్ రవి, రమావత్ రఘు, కోర్ర కిషన్, ఆంగోత్ శంకర్, ఆంగోత్ బాల, రమావత్ రమేష్, రమావత్ నగేష్, సభావత్ ముని, రమావత్ సాయి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Read...

గ్రేటర్ ఎన్నికల్లో మాదిగల వాటా తేల్చాలి: మేడి పాపయ్య మాదిగ

గ్రేటర్ ఎన్నికల్లో మాదిగల వాటా తేల్చాలి: మేడి పాపయ్య మాదిగ గ్రేటర్ ఎన్నికల్లో మాదిగల వాటా తేల్చాలి: మేడి పాపయ్య మాదిగ కేసీఆర్ దళిత ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి దళితుల పక్షపాతి 21న దళిత సర్పంచులకు సన్మానం ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మార్పీఎస్-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఎల్బీనగర్ పెన్ పవర్ జనవరి 03: దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను కేసీఆర్ నయవంచనకు గురి చేశారని ఎమ్మార్పీఎస్-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ విమర్శించారు. ఎమ్మార్పీఎస్-తెలంగాణ ఆధ్వర్యంలో ఉప్పల్ భగయాత్ వద్ద శనివారం జిహెచ్ఎంసి పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడి పాపయ్య మాదిగ హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తామని నాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను అణగదొక్కారని అన్నారు. దళితులను విస్మరించిన టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తరువాత సీఎం రేవంత్ రెడ్డి... ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించారని కొనియాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వాటా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాదిగ కులస్తులు సిద్ధంగా ఉన్నారని, మా వాటాను త్వరగా తేల్చాలని కోరారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలుపొందిన ఎస్సీ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీన ఉప్పల్ భగయాత్ లో నిర్వహిస్తున్నామని, ఈ సన్మాన సభకు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, దామోదర రాజనర్సింహ, వివిధ పార్టీలకు చెందిన ఎస్సీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈనెల 21వ తేదీన జరిగే సన్మాన సభ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్-తెలంగాణ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావాలని మేడి పాపయ్య మాదిగ కోరారు. అంతకుముందు మేడి పాపయ్య మాదిగను పుష్పగుచ్ఛాలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్-తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దాల రవికుమార్, నాయకులు రుక్కమ్మ, మంద జయన్న, భీమ్, లాజరస్, గణేష్, సుగుణమ్మ, ధనలక్ష్మి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Read...

మల్ రెడ్డి రాంరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జైపాల్ రెడ్డి

మల్ రెడ్డి రాంరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జైపాల్ రెడ్డి మల్ రెడ్డి రాంరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జైపాల్ రెడ్డి ఎల్బీనగర్ పెన్ పవర్ జనవరి 01: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డిని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు మరిన్ని ఉన్నతమైన సేవలను అందించాలని కోరారు. మల్ రెడ్డి రాంరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మైనార్టీ సెల్ నాయకులు ఎండీ జానిమియా, అస్సాం, నాయకులు కాసోజు శ్రీనివాస్, భానుచందర్ తదితరులు ఉన్నారు.
Read...

జీవో 252 ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా

జీవో 252 ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా జీవో 252 ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా  టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేత అక్రిడిటేషన్ కార్డులను తగ్గిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం  టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ రంగారెడ్డి పెన్ పవర్ డిసెంబర్ 27:  తెలంగాణ ప్రభుత్వం సమాచార శాఖ ఇటీవల విడుదల చేసిన జీవో 252 ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డు అయిన అక్రిడిటేషన్ కార్డ్ లు భారీ సంఖ్యలు తగ్గే ప్రమాదం ఉందని, వెంటనే జీవో 252 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై జీవో 252 కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టను నినాదాలు చేశారు. ధర్నా అనంతరం మీడియాతో టియుడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 23 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ కార్డులు జారీ చేయకపోగా ఉన్న కార్డులను కోత విధించే విధంగా జీవో 252 విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములైన జర్నలిస్టులకు నేడు అవమానం ఎదురవడం దురదృష్టకరమని అన్నారు. లక్ష జనాభా కు ఒక కార్డు చొప్పున హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ఉన్న అతిపెద్ద నియోజకవర్గాలలో కేవలం ఒకే కార్డుతో జర్నలిస్టులు ఏ విధంగా న్యాయం పొందుతారో మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన అల్లం నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విధివిధానాలను రూపొందించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగే విధంగా 23 వేల అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం 100 కోట్ల బడ్జెట్ను అసెంబ్లీ లో ప్రకటింప చేసి 42 కోట్ల రూపాయల నిధులను మీడియా అకాడమీ అకౌంట్లో జమ చేసిన చరిత్ర అల్లం నారాయణ గారిదని అన్నారు. హెల్త్ కార్డులు ఇండ్ల స్థలాలు సాధించిన చరిత్ర అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న టి యు డబ్ల్యూ జే నాయకత్వాన్నిదని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకు రాకపోగా ఉన్న అక్రిడేషన్ లను కూడా కోత పెట్టి విధంగా జీవో తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు యూనియన్ నాయకులమని చెప్పుకొని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి తన పదవికి రాజీనామా చేసి జర్నలిస్టుల పక్షాన పోరాటానికి కలిసి రావాలని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల హక్కులను కాలరాయాలని చూస్తే ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా పోరాటం చేయడానికి టీయూడబ్ల్యూజే సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి పైల్ల విట్టల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ జర్నలిస్టులు అవమానానికి లోను కావలసిన దుస్థితి నేడు దాపురించిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాటం చేసిన తమలాంటి జర్నలిస్టులు కూడా ఈరోజు అక్కుల సాధన కోసం అని రోడ్లపై బైఠాయించి పరిస్థితి రావడం దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతటి ఉద్యమాలకైనా వెనుకాడేది లేదని విటల్ రెడ్డి తేల్చి చెప్పారు. ధర్నా అనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి శ్రీనివాస్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, కోశాధికారి వెంకటేష్, రాష్ట్ర నాయకులు చందర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, పల్లె వెంకన్న, ఈర్ల చంద్రం, యూనియన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు సూరమొని సత్యనారాయణ, శేర్లింగంపల్లి నియోజక వర్గం అధ్యక్షులు ఉప్పరి రమేష్ సాగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు చిత్రం సైదులు, షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read...

పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు: డీజీపీ శివధర్ రెడ్డి

పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు: డీజీపీ శివధర్ రెడ్డి పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు: డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ పెన్ పవర్ డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గీత దాటితే వేటు తప్పదు అనే సూక్తి గుర్తుచేస్తూ, పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ చేస్తే ఎవరైనా (హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ) బాధ్యుడవుతారని హెచ్చరించారు. సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. ప్రతి పోలీసుకూ ఇది తెలుసు. అయినా వాటిపై దృష్టి సారించి, పోలీసు స్టేషన్‌లను సెటిల్మెంట్ సెంటర్లుగా మార్చడం తప్పు. ఇలాంటి ఫిర్యాదులు వస్తే, పార్టీలు/పంచాయితీలకు మళ్లించాలి” అని పేర్కొన్నారు. ప్రస్తుతం వివాదాలను పరిష్కరించిన స్టేషన్లు, అధికారులపై తక్షణమే వేటు (కఠిన చర్యలు) పడుతుంది. ఎస్పీలు, సీపీలు, హోం గార్డులు – ఎవరూ మినహాయింపు లేదు.” అని తెలిపారు. పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదు. అక్రమాలు, నీతి లోపాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుంది. మన ప్రవర్తన యూనిఫామ్‌కు గౌరవాన్ని, ప్రభుత్వానికి ప్రతిష్టను, సమాజంలో శాంతిని కల్పించాలి’’ అని కోరారు.
Read...

బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్

బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్ బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి  ఎల్బీనగర్ పెన్ పవర్ డిసెంబర్ 21: హయత్ నగర్ డివిజన్‌లోని బంజారా కాలనికి చెందిన పలువురు యువకులు నేడు బీజేపీలో చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సమక్షంలో హయత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు పార్టీ కండువా వేసి అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి రావడం పార్టీకి నూతన శక్తిని ఇస్తుందని, అభివృద్ధి రాజకీయాల కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ధ్యేయమని, యువత చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంఘీ అశోక్ ,డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి, నాయకులు మధు సుధన్ బంజర కాలనీ బిజెపి నాయకులు జాంజా నాయక్, హరి నాయక్ , బాలు నాయక్, భరత్, చిరంజీవి మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Read...

ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు

ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు హైదరాబాద్ పెన్ పవర్ డిసెంబర్ 20: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థిని వర్షిత హైదరాబాద్‌లోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్ర విద్యార్థి సభావట్ కళ్యాణ్ ఫిర్యాదు చేయగా, దానిని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసును స్వీకరించింది. తెలంగాణలోని ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల మృతులు పునరావృతమవుతున్నాయన్న ఆరోపణలను కమిషన్ గమనించింది. అధిక విద్య ఒత్తిడి, మానసిక వేధింపులు, కౌన్సెలింగ్ లోపం, హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం వంటి కారణాలతో విద్యార్థుల జీవన హక్కు, గౌరవంతో జీవించే హక్కు (భారత రాజ్యాంగం ఆర్టికల్ 21) ఉల్లంఘనకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ డీజీ (ఇన్వెస్టిగేషన్) ఆధ్వర్యంలో స్పాట్ ఎంక్వైరీ నిర్వహించి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.
Read...

పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఎల్బీనగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ తరలివచ్చిన వేలాది మంది బహుజనులు, రాజకీయ పార్టీల నేతలు ఎల్బీనగర్ పెన్ పవర్ డిసెంబర్ 14: బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించేందుకు ఆనాడు బహుజనులను కలుపుకొని వీరోచిత పోరాటాన్ని చేసిన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో నెలకొల్పిన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బహుజనులతో కలిసి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం ఆనాడు పోరాటాన్ని కొనసాగించిన బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలను కలుపుకొని నాడు గోల్కొండ కోటను ఏలిన మహనీయుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. మహనీయులు చూపిన మార్గంలో యువత పయనించి వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ ను, అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబాల మల్లేశం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్, పంజాల జైహింద్ గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, సామ రంగారెడ్డి, వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి, జీవీ సాగర్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, ముద్దగౌని సతీష్ గౌడ్, ఆకుల పవన్ గౌడ్, కొత్త రవీందర్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, బాలరాజ్ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణగౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, చామకూర రాజు, వేముల కొండల్ గౌడ్, పాండు గౌడ్, దుర్గయ్య గౌడ్, రావుల రాజు గౌడ్, చందు గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, కూరేళ్ల వేములయ్య గౌడ్, మిద్దెల మల్లేశం గౌడ్, సుర్వి రాజు గౌడ్, సుర్వి వెంకటేష్ గౌడ్, పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, విజయ గౌడ్, బొమ్మ రఘురాం నేత, వేముల రాము నేత, భాతర ప్రసాద్ నేత, బొంగు వెంకటేష్ గౌడ్, మహేష్ గౌడ్, నీరజ గౌడ్, సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లె గణేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వీరమల్ల వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కొత్త వెంకటేష్ గౌడ్, బొడిగె స్వామిగౌడ్, కోశాధికారి కొండూరు లక్ష్మీపతి గౌడ్, కార్యదర్శి వెంకటరమణ గౌడ్, సహాయ కార్యదర్శులు బత్తిని కిషన్ గౌడ్, రావుల సంతోష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు కిషోర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, రాజు గౌడ్, అశోక్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, తరుణ్ గౌడ్, రాకేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్, రాంచరణ్ గౌడ్ లతోపాటు వేలాదిమంది బహుజనులు పాల్గొన్నారు.
Read...

About The Author