ఆలయానికి చేరుకున్న చోళుల కాలం నాటి విగ్రహాలు

నేటి శివపార్వతుల కళ్యాణంలో ప్రధాన ఆకర్షణ

ఆలయానికి చేరుకున్న చోళుల కాలం నాటి విగ్రహాలు

IMG-20241112-WA0106

నర్సీపట్నం, పెన్ పవర్ :

బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన చోళుల కాలం నాటి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు సుదీర్ఘ విరామం తర్వాత ఆలయానికి చేరుకున్నాయి. అత్యంత పురాతనమైన ఈ పంచలోహ విగ్రహాలు 1990లో చోరీ కాబడ్డాయి. తరువాత తాళ్లరేవు ప్రాంతంలో పోలీసులు వీటిని రికవరీ చేశారు. అప్పటినుండి  ఈ విగ్రహాలు ట్రెజరీ లోనే భద్రపరుస్తూ వచ్చారు. ప్రతి ఏడాది ఆలయంలో జరిగే శివపార్వతుల కళ్యాణానికి వేరే విగ్రహాలు వాడుతూ వచ్చారు. అయితే ఈ సంవత్సరం ఏకాదశి రోజు జరగనున్న శివపార్వతుల కళ్యాణంలో ఆనాటి విగ్రహాలనే ఉంచాలని ఉత్సవ కమిటీ పట్టు పట్టింది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు ట్రెజరీ లో ఉన్న ఈ పంచలోహ విగ్రహాలను గట్టి బందోబస్తు నడుమ ఆలయానికి చేర్చారు. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత పురాతన పంచలోహ విగ్రహాలు ఆలయానికి చేరుకోవడంతో, వాటిని చూసి తరించేందుకు స్థానికులు బారులు తీరారు. మంగళవారం జరగనున్న శివపార్వతుల కళ్యాణంలో ఈ పురాతన విగ్రహాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల