వర్షాకాలం అన్ని విధాల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు 

వర్షాకాలం అన్ని విధాల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు 

స్టాప్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జులై 20: రాష్ట్రంలో తుఫాను కారణంగా అధిక వర్షపాతం నమోదవుతున్న తరుణంలో మన గిరిజన ప్రాంతాలలో గేడ్డలు,వాగులు పొంగి ప్రవహిస్తున్నాయిని అత్యవసర పరిస్థితులలో రాకపోకలు జరిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల పాడేరు ఎమ్మెల్యే మత్స్య రస విశ్వేశ్వర రాజు ప్రజలకు పిలుపునిచ్చారు.

భారీ వర్షాల వల్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినచో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈ విషయం పట్ల అధికారులు రైతులకు అండగా నిలబడాలని కోరారు.వర్షాకాలంలో దోమల ప్రభావం గ్రామాలలో ఎక్కువగా ఉంటుందని దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.దోమ కాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి పలు వ్యాధులకు చికిత్స అందించడంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆశ,

IMG-20240721-WA0000
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మత్స్యరస

కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ మండల వైద్యాధికారులు తగు సలహాలు సూచనలు ఇస్తూ తగిన మందులు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.వర్షకాలం కారణంగా ప్రజలందరూ వేడి నీటిని మాత్రమే తాగాలని సలహా ఇచ్చారు. తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తాకరాదని తడివలన దాంట్లో విద్యుత్ సరపర జరిగి విద్యుత్ ఘాతం ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరు బయటకు వెళ్ళవద్దు అని అన్నారు. అలాగే మండల అధికారులు,సచివాలయం సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకు వర్షం వల్ల ఏ ప్రమాదం జరిగిన సహాయం చేయటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల