వర్షాల నేపథ్యంలో పాఠశాలల సెలవు పొడిగింపు:జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 21: జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు సోమవారం కూడా స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులు 19,20 తేదీలలో స్థానిక సెలవు ప్రకటించిన విషయం విధితమే.ప్రస్తుతము ఇంకా వర్షాలు తగ్గ ముఖం పట్టనందున 22వ తేది సోమవారం కూడా సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.అయితే చింతూరు డివిజన్లో ముంపు మండలాలైన చింతూరు, ఎటపాక,వి.ఆర్ పురం, కూనవరం మొదలగు నాలుగు మండలాల్లో 23వ తేదీ మంగళవారం కూడా సెలవు ప్రకటించారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి చింతూరు డివిజన్ మినహా మిగిలిన 18 మండలాల్లో సోమవారం సెలవుగా భావించి తమ పిల్లలను పాఠశాలలకు పంపవద్దని కలెక్టర్ సూచించారు.అదేవిధంగా చింతూరు డివిజన్లోని నాలుగు మండలాలకు సోమవారం,మంగళవారం సెలవు ప్రకటించినందున వారి పిల్లలను పాఠశాలకు పంపవద్దని కలెక్టర్ కోరారు.అన్ని విద్యాసంస్థలకు అంటే కళాశాలు, ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలు,

IMG-20240720-WA0010
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల