మొక్కల పెంచి పర్యావరణాన్ని కాపాడండి:డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయభారతి 

స్టాప్ IMG-20240820-WA0010 రిపోర్టర్,పాడేరు/చింతపల్లి,పెన్ పవర్,ఆగష్టు 20:మొక్కలు నాటి పర్యావరణం కాపాడడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయభారతి అన్నారు.మంగళవారం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక ఏపీవో తో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో అమ్మ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి చేత ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత ఆ విద్యార్థికి అప్పగించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో 600వివిధ రకాలైన మొక్కలను నాటుతున్నమన్నారు.ఈ మొక్కలను ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది అన్నారు.ఈ మొక్కలను కళాశాల మైదానం అంతా నాటుతామన్నారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ పాత్రుడు,అధ్యాపకులు రమణ, లీలపావని,రవీంద్రనాయక్,ఈశ్వరరావు,జగత్ రాయ్, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల