సీజనల్ వ్యాధుల పట్ల గిరిజనులకు అవగాహన కల్పించాలి

కలెక్టర్ ను కోరిన ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి 

స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 19: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ను అరకు పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనుజారాణి మర్యాదపూర్వకంగా కలిశారు.పుష్పగుచ్చం అందించి దుస్సాల్వతో సన్మానించి జ్ఞాపికను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు రాకుండా తాగునీరు కలుషితం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని,వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరును కోరారు.ఎప్పటికప్పుడు గ్రామాలలో శానిటేషన్ చేసేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేలా వారికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

IMG-20240719-WA0894
కలెక్టర్కు వినతి పత్రం ఇస్తున్న ఎంపీ డాక్టర్ తనూజ రాణి

జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఎంపీ డాక్టర్ తనూజ రాణి భర్త చెట్టి వినయ్ కూడ వున్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల