MADHAV PATHI

అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..!

అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..! ఒక్కరోజు కురిసిన భారీవర్షానికే.. హైదరాబాద్ నగరం రోడ్లపై పడవల్లో తిరుగుతున్న అధికార యంత్రాంగం, హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువుల కబ్జాలపై నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నాలా కబ్జా పరిశీలనలో భాగంగా, బహుదూర్‌పల్లి ప్రైమార్క్ కబ్జాను (2025 మార్చి 13న సందర్శించి.. నాలా కబ్జాను గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చర్యలు తీసుకోక పోగా.. ఆక్రమణ దారుల ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లకు "మార్చి 19న" హెచ్ఎండిఏ నుండి "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" ఇవ్వడం గమనార్హం.. 2000 గజాల బాబాఖాన్ చెరువు నాలా స్థలాన్ని ఆ నాలుగు శాఖలు అమ్ముకున్నారా..? నాలా ఉన్నట్టు "పాత చిత్రాల" ఆధారాలు, రెవెన్యూ, ఇరిగేషన్ జాయింట్ సర్వే నివేదికలతో "పెన్ పవర్" దినపత్రికలో గత మూడేళ్ళుగా వార్తా కథనాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. చివరికి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఆ నాలుగు శాఖల  అధికారులు అనుకున్నదే చేశారు..! ఈ వ్యవహారంతో ప్రైమార్క్ కబ్జాదారుల నుండి తీసుకున్న ముడుపులకు, న్యాయం చేశారని స్పష్టమవుతుంది.. చెరువు నాలా కబ్జాకు గురైందనే దానికంటే..! ఒప్పందం ప్రకారం కబ్జాదారునికి అప్పగించామనే సంతృప్తిని అధికారులకు మిగిల్చినట్టు తెలుస్తోంది.. మరోవైపు హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీపై, హైకోర్టును ఆశ్రయించిన, విల్లాల బాధితుల అభ్యంతరం చెప్పకపోవడంలో పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. నాలా ఆక్రమణ బాధితుల మౌనంపై భిన్న కథనాలు వస్తున్నాయి..వారిని కూడా మేనేజ్ చేశారేమో అంటూ ఆరోపణలు లేకపోలేదు..
Read...

మూడు కూల్చారు..! ఒకటి వదిలేశారు..!

మూడు కూల్చారు..! ఒకటి వదిలేశారు..! ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడాల్సిన రెవెన్యూ అధికారులు..! కబ్జాదారులకు కట్టబెట్టేందుకు, సూచనలు, సలహాలు ఇస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రశ్నించిన వారికి, "పిల్లి కళ్ళు మూసుకుని" పాలు త్రాగిన చందంగా కహానీలు వినిపిస్తున్నారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూములు పరాధీనం కావడానికి, రెవెన్యూ అధికారులే కీలకపాత్ర పోషించడం విశేషం.. మంగళవారం మండలంలోని బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో  రెవెన్యూ కూల్చివేతలు హాస్యాస్పదం.. రెవెన్యూ అధికారుల సమాధానం అద్భుతం.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడాల్సిన రెవెన్యూ అధికారులు..! కబ్జాదారులకు కట్టబెట్టేందుకు, సూచనలు, సలహాలు ఇస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రశ్నించిన వారికి, "పిల్లి కళ్ళు మూసుకుని" పాలు త్రాగిన చందంగా కహానీలు వినిపిస్తున్నారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూములు పరాధీనం కావడానికి, రెవెన్యూ అధికారులే కీలకపాత్ర పోషించడం విశేషం.. దుండిగల్‌ మండలంలో మంగళవారం రెవెన్యూ కూల్చివేతలు హాస్యాస్పదం..
Read...

ఉస్మాన్‌కుంట సర్వే..! రహస్యమా..?

ఉస్మాన్‌కుంట సర్వే..! రహస్యమా..? జర్నలిస్టులపై వెంకట్ ప్రణీత్ వెంచర్ నిర్వాహకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.. తమ కబ్జా వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకే మీడియాను అనుమతించలేదని ఆరోపణలు.. వార్తా సేకరణలో భాగంగా సర్వే వివరాలను సేకరించకుండా, జర్నలిస్టుల పట్ల దాష్టికాన్ని ప్రదర్శించారు.. ఇరిగేషన్ చట్టాలను కాలరాస్తూ, చెరువును ఆక్రమించిందే కాకుండా..! హైడ్రా ఎస్పీ అశోక్ శుక్రవారం సందర్శించిన నేపథ్యంలో, ఆయన ఆదేశాలతో, శనివారం సమగ్ర సర్వే నిర్వహణపై, విలేకరులు వివరాలు సేకరించకుండా..! వెంచర్ నిర్వహాకులు సెక్యూరిటీతో అడ్డుకుని, మీడియాను అనుమతించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. వెంచర్ నిర్వాహకులు అధికారుల అండ చూసుకునే ఈవిధంగా రెచ్చిపోతున్నారని, సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. మరోవైపు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుంది.. వార్తల్లో వస్తేనో, ఎవరైనా ఫిర్యాదులు చేస్తేగాని, ఇలా సర్వేలు, చర్యలు చేపట్టే పరిస్థితి లేదని, స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఉస్మాన్‌కుంటను తమ వెంచర్ లేక్‌గా పేరుమార్చి హాలీవుడ్ లెవెల్‌లో పెద్దక్షారలతో రాయడం, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టే ప్రక్రియలో భాగమేనని విమర్శలు వస్తున్నాయి.. చెరువు కబ్జా వివరాలు బయటకు పొక్కకుండా, అధికారులను మేనేజ్ చేసేందుకే..! వెంచర్ నిర్వాహకులు మీడియాను అడ్డుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
Read...

గాగిల్లాపూర్‌ ఉస్మాన్‌కుంటను.. సందర్శించిన హైడ్రా ఎస్పీ అశోక్..

గాగిల్లాపూర్‌ ఉస్మాన్‌కుంటను.. సందర్శించిన హైడ్రా ఎస్పీ అశోక్..    గాగిల్లాపూర్‌ ఉస్మాన్ కుంటపై సమగ్ర సర్వే చేయాలని ఆదేశం..    కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఉస్మాన్‌కుంటను సందర్శించిన ఎస్పీ.. చెరువు ఆక్రమణపై స్థానిక తహశీల్దార్‌ మతీన్‌ని ప్రశ్నించిన హైడ్రా అధికారులు.....
Read...
తెలంగాణ/Telangana  హైదరాబాద్ / Hyderabad  యదాద్రి / Yadadri  నిజామాబాద్ / Nizamabad  కామారెడ్డి / Kamareddy  రంగారెడ్డి / Ranga Reddy  వరంగల్ / Warangal 

నోటీసులిచ్చిన అక్రమ షెడ్డుపై..! చర్యలేవి తహశీల్దార్ సాబ్..?

నోటీసులిచ్చిన అక్రమ షెడ్డుపై..! చర్యలేవి తహశీల్దార్ సాబ్..?   227 ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్డుపై ఏడాది దాటినా..! చర్యలు శూన్యం.. బౌరంపేట్ సర్వే నెం.166 ప్రభుత్వ భూమిలో అక్రమంగా 40 ఫీట్ల సీసీరోడ్డు.. ఈ రెండు చోట్ల నోటీసులిచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ చర్యలు శూన్యం.. అధికారుల్లో‌ నిజాయితీ..! విధుల్లో పారదర్శకత లోపిస్తే..!ఇలాగే ఉంటుందేమో..? 2024లో బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు నిర్మాణం.. 2025లో బౌరంపేట్ 166 ప్రభుత్వ భుమిలో ఒప్పందపు సీసీరోడ్డు.. అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్‌ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..*అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్‌ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..
Read...

చిన్నదామెర చెరువు కబ్జా..! కథ కంచికేనా..!

చిన్నదామెర చెరువు కబ్జా..! కథ కంచికేనా..!   హైదరాబాద్ మహానగరం అభివృద్ధి దేవుడెరుగు..! భారీ వర్షాలు వస్తున్నాయని, వాతావరణ శాఖ సమాచారం వింటేనే‌ నగర ప్రజలు వణికి పోతున్నారు.. మరోవైపు నగరంతో పాటు, హైదరాబాద్ శివారు ప్రాంతాల చెరువులకు సంబంధిత అధికారులే గండంగా తయారయ్యారు.. కేవలం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువులు, కట్టుకాలువలు అంతరించి పోతున్నాయి.. దీంతో భవిష్యత్తులో ప్రజల మనుగడకే పెను ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు..మరో ఐదేళ్ళలో, పెద్దపెద్ద చెరువులు కుంటలుగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.. రైతేరాజు..! దేశానికి వెన్నుముక రైతు..! రైతులేనిదే రాజ్యం లేదంటారు..! ఇదంతా పొగడ్తలకే పరిమితమైంది.. రేయింబవళ్ళు కష్టపడి రైతుపండించిన పంటతో దళారులు కోటిశ్వరులు అవుతున్నారు.. రైతు మాత్రం అదే ఎండిన డొక్కలు.. ఒకపూట తింటే మరోపూటకు నీళ్ళు తాగి బతకాల్సిన పరిస్థితి నేటికీ గ్రామాల్లో చూస్తున్నాం.. రైతులు అంటేనే అధికారుల్లో అదో చిన్నచూపు అంటూ విమర్శలు..!
Read...

విజిలెన్స్ వ్యవస్థ..! ఉనికిని కోల్పోతుందా..?

విజిలెన్స్ వ్యవస్థ..! ఉనికిని కోల్పోతుందా..? అవినీతి నిర్మూలనకు, పాలకులు ఉన్నతాధికారులు శపథం చేస్తున్నప్పటికీ..! ఆచరణలో మాత్రం విఫలమవుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. వివిధ విభాగల్లోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విజిలెన్స్ వ్యవస్థ తన ఉనికిని కోల్పోతుందని విమర్శలు వస్తున్నాయి.. ఆయా శాఖలపై సంబంధిత విజిలెన్స్ విభాగం, నిఘా కొరవడింది..! చెరువుల కబ్జాలు, నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు, చట్టంలోని లోపాలతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల మంజూరు వంటి అంశాలు, విజిలెన్స్ వ్యవస్థ తీరును ఎండ గడుతున్నాయి.. చారిత్రక ఆనవాళ్ళు ఆక్రమణలకు గురవుతుంటే..! చోద్యం చూస్తూ, సంబంధిత అధికారులు అక్రమార్కులకి ఔట్‌రైట్‌గా సహకరించడంపై, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..*
Read...

కూల్చేసిన అక్రమ షెడ్డుకు..! విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్..

కూల్చేసిన అక్రమ షెడ్డుకు..! విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్.. *అధికారులకు చెప్పుకోవడానికో సాకు దొరికితే చాలు..! పొంతన లేని సమాధానం చెప్పడం కొత్తేమి కాదు.. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారంలో దుండిగల్‌ రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య.. బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో, అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ మతీన్, ఏడాది దాటినా చర్యల ఊసేలేదు.. రెండుసార్లు మొక్కుబడిగా పాక్షిక చర్యలతో మమాః అనిపించి ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు ఉండగా..! ఇప్పుడు పై అధికారులను కూడా మేనేజ్ చేసి, చర్యలు లేకుండా సైలెంట్‌ అయ్యారని సమాచారం..! ఇదే తరహాలో గాగిల్లాపూర్‌ భూదాన్ భూమిలోని అక్రమ షెడ్డు వ్యవహారంలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. అందుకు సాక్ష్యమే ఈ పాక్షిక కూల్చివేతల షెడ్డు..! రెవెన్యూ కూల్చేసిన అరకొర చర్యలకు విద్యుత్ శాఖ చేతివాటం తోడై..! అక్రమంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పలు విమర్శలకు దారితీస్తుంది..**అధికారులకు చెప్పుకోవడానికో సాకు దొరికితే చాలు..! పొంతన లేని సమాధానం చెప్పడం కొత్తేమి కాదు.. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారంలో దుండిగల్‌ రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య.. బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో, అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ మతీన్, ఏడాది దాటినా చర్యల ఊసేలేదు.. రెండుసార్లు మొక్కుబడిగా పాక్షిక చర్యలతో మమాః అనిపించి ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు ఉండగా..! ఇప్పుడు పై అధికారులను కూడా మేనేజ్ చేసి, చర్యలు లేకుండా సైలెంట్‌ అయ్యారని సమాచారం..! ఇదే తరహాలో గాగిల్లాపూర్‌ భూదాన్ భూమిలోని అక్రమ షెడ్డు వ్యవహారంలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. అందుకు సాక్ష్యమే ఈ పాక్షిక కూల్చివేతల షెడ్డు..! రెవెన్యూ కూల్చేసిన అరకొర చర్యలకు విద్యుత్ శాఖ చేతివాటం తోడై..! అక్రమంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పలు విమర్శలకు దారితీస్తుంది..*
Read...

చెరువులో-ప్రభుత్వ భూమిలో.. ఇంటి నెంబర్‌లు..

చెరువులో-ప్రభుత్వ భూమిలో.. ఇంటి నెంబర్‌లు.. దొరికితేనే దొంగలు..! లేకపోతే అందరూ దొరలే..! దుండిగల్‌ మున్సిపాలిటీలో ఇంటి నెంబర్‌ల కేటాయింపు అధికారుల చేతివాటానికి నిదర్శనం.. పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామపంచాయతీలను ఒకటిగా చేసి మున్సిపాలిటీలుగా ఆవిర్భావం చెందినా "పెనం పైనుండి పొయ్యి"లో పడిన చందంగా తయారైంది.. టిజి-బిపాస్ చట్టాన్ని కూడా ఈ మున్సిపాలిటీలో నిర్వీర్యం చేస్తున్నారు.. ఇదొక్కటే కాదు ప్రస్తుతం తెలంగాణలో ఏ మూల చూసినా అధికార యంత్రాంగం తీరు అవినీతి మయంగా తయారైంది.. చివరికి ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ కూడా రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు దొరికిన ఘటన నిన్ననే వెలుగులోకి వచ్చింది.. మరోవైపు విద్యుత్, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో కింది స్థాయి నుండి పైస్థాయి వరకు ఆదాయానికి మించి అదనపు ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఏసిబి సోదాలు చూస్తూనే ఉన్నాం.. వీరిపై తక్షణ, శాశ్వత చర్యలు లేకపోవడం, వరంగా మారింది.. కొందరు రెండు సార్లు అనిశా అధికారులకి పట్టుబడిన అధికారులు సైతం మళ్ళీ విధుల్లో కొనసాగుతున్నది కూడా చూస్తున్నం.. తెలంగాణలో పాలకులు ప్రభుత్వ ఉచిత పథకాలు అమలుకై పాకులాడటం లోనే నిమగ్నమై పోగా..! గత పదేళ్ళుగా గల్లీ నాయకులకు సైతం అధికారులపై పెత్తనం అప్పగించారు.. "అడ్మినిస్ట్రేషన్" వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేశారనే విమర్శలు లేకపోలేదు.. అప్పుడు ఇప్పుడు బికారీలను కూడా కుబేరులను చేసిన ప్రభుత్వ భూముల కబ్జాల కట్టడిలో యంత్రాంగం విఫలమైంది అనడంలో అతిశయోక్తి కాదు..
Read...

హుడా" లేఅవుట్‌లో.. ప్రజాప్రయోజనాలు రిజిస్ట్రేషన్‌

హుడా కబ్జాకు కాదేది అనర్హం..! ప్రభుత్వ భూములైనా..! పార్కు స్థలాలు అయినా..! కబ్జా చేయడమే ప్రధాన లక్ష్యం.. ఈ వ్యవహారంలో కాలనీ అసోసియేషన్‌లతో పాటు సంబంధిత అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. మరోవైపు పార్కు స్థలాలు, చెరువుల పరిరక్షణా పేరుతు ఏర్పాటైన "ఆపరేషన్ హైడ్రా" కూడా ఎప్పటి కప్పుడు హెచ్చరించినా, అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం, అక్రమార్కులు బరితెగిస్తున్నారు. దుండిగల్‌ మున్సిపాలిటీలో గతంలో విధులు నిర్వర్తించిన కమిషనర్‌‌లు, టౌన్‌ప్లానింగ్ అధికారుల చేతివాటంతో, వారి నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో చూడండి..!బహుదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ హౌసింగ్ కాలనీలోని 3600 గజాల పార్కుస్థలం గుర్తించిన అధికారులు..! ఫెన్సింగ్ వేయడానికి అసోసియేషన్‌కి లేఖను అందజేసిన అనంతరం.. కబ్జా చేసినోళ్ళకే ఇంటి అనుమతులు జారీచేసి పట్టంకట్టి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారు.. ఇపుడు బౌరంపేట్ సింహపురి కాలనీకి చెందిన "హుడా" లేఅవుట్‌ ఓపెన్ ప్లాట్‌లు, ప్రజాప్రయోజనాలు సైతం విక్రయించి బై నెంబర్‌లతో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ యధేచ్చగా కొనసాగుతుంది..ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళినా చోద్యం చూస్తున్నారు.. సంబంధిత కబ్జసలను అనుమతులు తీసుకుని అక్రమ కట్టడాలు ప్రారంభించడమే తరువాయి.. ఈ వ్యవహారంలో దుండిగల్‌ మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడం స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..
Read...

కన్జర్వేషన్ జోన్‌లో..! కార్పోరేట్ పాఠశాల..!

కన్జర్వేషన్ జోన్‌లో..! కార్పోరేట్ పాఠశాల..! అసలు నిర్మాణాలే చేపట్టకూడని కన్జర్వేషన్ జోన్‌లలో అక్రమ కట్టడాలు, ఆపై కార్పోరేట్ విద్యాసంస్థ పాఠశాల నిర్వహణకు..! ఇటు మున్సిపల్ అధికారులు, అటు విద్యాశాఖ అధికారి బరితెగించి సహకరిస్తున్నారు.. కార్పోరేట్ విద్యాసంస్థల నుండి ముడుపులు దండుకుని, రెండు శాఖల యంత్రాంగం విద్యార్థులను రిస్కులో పెడుతున్నారు.. చట్టాలను నిర్వీర్యం చేస్తూ, నిబంధనలు విస్మరిస్తున్నారు.. అక్రమార్కుల కోసమే ఈ కార్యాలయాలు తెరిచారా అన్న ఆరోపణలు లేకపోలేదు.. బౌరంపేట్ గ్రామ పరిధిలోని కన్జర్వేషన్ జోన్‌లో అక్రమ కట్టడాలతో "వ్యాసా స్కూల్" నిర్వహిస్తున్న యాజమాన్యానికి, దుండిగల్‌ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ దాసోహం అంటుండగా..! జిల్లా విద్యాశాఖ అధికారులు బహిరంగంగానే బరితెగించి వ్యవహరిస్తున్నారు.. నిర్మాణాలు నిషేధించిన చోట అక్రమ కట్టడాలు చేపడుతుంటే..! తానా తందానా అంటూ విద్యాశాఖ సహకరిస్తుంది.. వార్తలు వచ్చినా పట్టించుకోకుండా లంచావతారులుగా వ్యవహరిస్తున్న మున్సిపల్, విద్యాశాఖ అధికారుల తీరుపై పెన్ పవర్ ప్రత్యేక కథనం..
Read...

ఇరిగేషన్ ఎ‌న్‌వోసి లేకుండానే..! హెచ్ఎండిఏ "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్"..!

ఇరిగేషన్ ఎ‌న్‌వోసి లేకుండానే..! హెచ్ఎండిఏ    ప్రైమార్క్‌ పలుకుబడితో..నాలాను దారిమళ్ళించే ప్రక్రియ షురూ.. బాధితుల విల్లాల మీదుగానే నాలాను ఏర్పాటు చేసేయత్నం.. నాలపై ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లు రక్షించే దిశగా..!పావులు కదుపుతున్న యంత్రాంగం. 2025 మార్చి 13న ప్రైమార్క్‌ను సందర్శించిన హైడ్రా కమిషనర్.. 2025 మార్చి 19న హెచ్ఎండిఏ...
Read...

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.